News April 6, 2024
ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా పనిచేయండి: కలెక్టర్

త్వరలో జరగనున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా శాంతియుతంగా, హింసా రహితంగా నిర్వహించడమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలో పర్యటించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం ఎఫ్ఎస్టీ బృందాల పనితీరును పరిశీలించి అనంతరం సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు.
Similar News
News November 3, 2025
శ్రీకూర్మంలో బండి ఎక్కిన పడవ

గార(M) శ్రీకూర్మనాథ స్వామి ఆలయం సమీపంలో ఆదివారం పడవను పోలిన బండిని చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా వేటకు వెళ్లని మత్స్యకారులు నావలకు రిపేర్లు చేయించారు. సాయంత్రం పడవను నాటు బండిపై ఎక్కించుకొని తీసుకుని వెళ్లిన దృశ్యాన్ని చూసేయండి.
News November 3, 2025
నేడు శ్రీకాకుళంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం

నేడు (నవంబర్ 3న) ప్రజా ఫిర్యాదులు నమోదు మరియు పరిష్కార వేదిక, శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. https://Meekosam.ap.gov.in వెబ్ సైట్లో అర్జీదారులు తమ ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు. వినతులు సమర్పించిన అనంతరం వాటి స్థితిని తెలుసుకొనేందుకు 1100 నంబర్కు నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు.
News November 2, 2025
SKLM: ఒక్కొక్కరికి రూ.17లక్షల పరిహారం

కాశీబుగ్గ వేంకన్న ఘటన నేపథ్యంలో ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి. మృతుల కుటుంబాలకు రూ.15లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. అలాగే కేంద్రం మృతుల కుటుంబానికి రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ప్రకటించింది. మొత్తంగా చనిపోయిన కుటుంబానికి రూ.17లక్షలు, గాయపడిన వారికి రూ.3.50లక్షల అందనుంది. మృతుల్లో TDP కార్యకర్తలు ఉండటంతో రూ.5లక్షల చొప్పున ఇన్సురెన్స్ రానుంది.


