News February 15, 2025

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి: కలెక్టర్

image

తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు అధికారులు ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి స్పష్టం చేశారు. ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఏలూరు జిల్లాలో 87 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News December 7, 2025

HNK: సర్పంచ్ అభ్యర్థి ఆఫర్ హల్‌చల్.. ఏకగ్రీవం విఫలం

image

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం జయగిరిలో సర్పంచ్ పదవి కోసం స్వతంత్ర అభ్యర్థి న్యాయవాది తాళ్లపల్లి వెంకటేశ్ ఏకగ్రీవం ఇస్తే గ్రామాభివృద్ధికి రూ.50 లక్షలు ఖర్చు చేస్తానని ప్రకటించడంతో గ్రామంలో కలకలం చెలరేగింది. రచ్చబండ సమావేశంలో ఇతర అభ్యర్థులు ఉపసంహరణకు అంగీకరించినా, అధికార పార్టీ అభ్యర్థి పల్లె దయాకర్ హాజరుకాకపోవడంతో ఉపసంహరణ గడువు ముగిసిపోయింది. ఫలితంగా జయగిరిలో సర్పంచ్ పదవికి పోటీ అనివార్యమైంది.

News December 7, 2025

వామ్మో! HYDలో భారీగా పెరిగిన ధరలు

image

నగరంలో గుడ్ల ధరలు కొండెక్కాయి. విడిగా కొంటే గుడ్డు రూ.8- 9 వరకు అమ్ముతున్నారు. డజన్ రూ.90కి, ట్రే 220- 230 వరకు విక్రయిస్తున్నారు. ఉప్పల్, హయత్‌నగర్, ఎల్బీనగర్‌లో ఎగ్ డీలర్స్ వద్ద స్టాక్ లేకపోవడం ధరల ఎఫెక్ట్ కనిపిస్తోంది. వర్కవుట్స్ చేసే వారికి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోటీన్ సోర్స్ గుడ్డే..త్వరగా కర్రీ చేసుకునే బ్యాచిలర్లు ఇబ్బందిగానే మారిందంటున్నారు. 3వారాలుగా గుడ్ల ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.

News December 7, 2025

MBNR: రెండో దశలో 239 మంది సర్పంచ్‌ల విత్‌డ్రా

image

స్థానిక సంస్థల రెండో దశ ఎన్నికల్లో మొత్తం 239 మంది సర్పంచ్‌ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 151 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు పేర్కొన్నారు. హన్వాడ మండలంలో అత్యధికంగా 58 మంది, కోయిలకొండలో 55 మంది నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్టు ప్రకటనలో వెల్లడించారు.