News March 20, 2024

ప్రశాంత వాతావరణంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగాలి: కలెక్టర్

image

జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరగాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం లక్కిరెడ్డిపల్లె జడ్పీ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పరీక్ష కేంద్రాల వద్ద బయట వ్యక్తులు గుంపుగా ఉండడంపై విద్యాశాఖ, పోలీస్ అధికారులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Similar News

News December 10, 2025

కడప: టెట్ పరీక్ష.. ఈ నంబర్లు సేవ్ చేసుకోండి

image

కడప జిల్లాలో ఇవాళ్టి నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో 15,082 మందికి 8 పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేశారు. ఏవైనా బ్బందులు ఉంటే 9959322209, 9849900614, 9948121966 నంబర్లకు సంప్రదించాలని DEO శంషుద్దీన్ సూచించారు. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలన్నారు.

News December 10, 2025

డిసెంబర్ నాటికి స్మార్ట్ కిచెన్ షెడ్స్ పూర్తి: కలెక్టర్

image

కడప జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ‘సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్’ నిర్మాణాలను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు శుచి, రుచికరమైన ఆహారం అందించడమే లక్ష్యమన్నారు. జిల్లాలో కొత్తగా 33 షెడ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వాహనాలు, పరికరాల టెండర్లపై చర్చించారు.

News December 10, 2025

డిసెంబర్ నాటికి స్మార్ట్ కిచెన్ షెడ్స్ పూర్తి: కలెక్టర్

image

కడప జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ‘సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్’ నిర్మాణాలను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు శుచి, రుచికరమైన ఆహారం అందించడమే లక్ష్యమన్నారు. జిల్లాలో కొత్తగా 33 షెడ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వాహనాలు, పరికరాల టెండర్లపై చర్చించారు.