News March 13, 2025
ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి: ఎస్పీ

జిల్లాలోని ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో హోలీని జరుపుకోవాలని గురువారం జిల్లా ఎస్పీ వి.రత్న తెలిపారు. ఈ సందర్భంగా ముందుగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఉన్నాయని, ఎవరూ గొడవలకు వెళ్లకూడదని తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో ప్రజలకు స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా ప్రవర్తించరాదన్నారు.
Similar News
News September 14, 2025
జగిత్యాలలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్

జగిత్యాల ఐఎంఏ హాల్లో గైనకాలజీ అసోసియేషన్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించింది. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ హేమంత్ ఈ సందర్భంగా పలువురు మహిళలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాక్సిన్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, ప్రతి మహిళ ఈ టీకా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ నివారణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్య భద్రతకు ఈ టీకా ఎంతో ముఖ్యమని తెలిపారు.
News September 14, 2025
చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు..

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.140 నుంచి 167, మాంసం రూ.203 నుంచి 260 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.231 నుంచి 285 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.210 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News September 14, 2025
మండవల్లి: యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడికి రిమాండ్

మండవల్లిలోని లోకుమూడికి చెందిన యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన కైకలూరు మండలం దానగూడేనికి చెందిన భరత్ కుమార్(21)పై కేసు నమోదు చేసినట్లు SI రామచంద్రరావు శనివారం తెలిపారు. ఈ నెల 12న సాయంత్రం యువతి ఇంటికి వెళ్లి అత్యాచారం చేయబోయాడు. ఆమె కేకలు వేయడంతో అడ్డువచ్చిన తల్లిదండ్రులపై కూడా దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసి కోర్టుకు తరలించగా..14 రోజుల రిమాండ్ విధించిందన్నారు.