News March 22, 2025
ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు 38 కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు డీఈవో కృష్ణప్ప తెలిపారు. శనివారం నిర్వహించిన పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 1,337 మందికి గాను 1,335 మంది హాజరయ్యారన్నారు. ప్రైవేట్ విద్యార్థులు 8 మందికి గాను ముగ్గురు హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 1,345 మందికి గాను 1,338 మంది పరీక్షలకు హాజరు కాగా.. ఏడుగురు గైర్హాజరయ్యారని తెలిపారు.
Similar News
News November 5, 2025
నిజామాబాద్: మహిళపై వేధింపులు.. ఇద్దరిపై కేసు నమోదు: SI

ఆయిల్ గంగాధర్, కొండా అమర్ అనే వ్యక్తులు తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, ఆడియో కాల్స్, వీడియో కాల్స్ చేస్తూ వెంటపడుతూ, వేధిస్తున్నారని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిరువురిపై సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామని NZB 4వ టౌన్ SI కె.శ్రీకాంత్ మంగళవారం తెలిపారు. కాగా బాధితురాలు సోమవారం ఓ వైద్యుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి తనను వేధిస్తున్నారని CPకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
News November 5, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 05, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.02 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.16 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.07 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.43 గంటలకు
✒ ఇష: రాత్రి 6.57 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 5, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


