News February 13, 2026
ప్రశ్నించడాన్ని CBN తట్టుకోలేకపోతున్నారు: జగన్

AP: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని CM CBN తట్టుకోలేకపోతున్నారని YCP అధినేత జగన్ అన్నారు. అందుకే తమ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. YCP MLAలు, MLCలతో ఆయన భేటీ అయ్యారు. ‘అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదు. బలం తక్కువ కావడంతో అక్కడ గొంతెత్తలేం. అందుకే మీడియాతో మాట్లాడుతున్నాం. మండలిలో బలం ఉంది కాబట్టి అవగాహనతో బాగా మాట్లాడాలి’ అని దిశానిర్దేశం చేశారు.
Similar News
News March 9, 2026
మా దేశ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం అనవసరం: ఇరాన్ FM

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నికలో విదేశీయుల ప్రమేయం అవసరం లేదని ఆ దేశ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరఘ్చి పేర్కొన్నారు. ఖమేనీ వారసుడిని ఎన్నుకోవడంలో తాము సాయం చేస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘మా దేశ వ్యవహారాల్లో ఇతరులను జోక్యం చేసుకోనివ్వం. ప్రజలు ఎన్నుకున్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ లీడర్ను నిర్ణయిస్తుంది’ అని చెప్పారు. కాగా కొత్త నాయకుడిగా మొజ్తాబా ఎన్నికైనట్లు వార్తలొస్తున్నాయి.
News March 9, 2026
గంభీర్.. ఒక్క ఫైనల్లోనూ ఓడలేదు

గౌతమ్ గంభీర్ ఇప్పటివరకూ ఒక్క ICC ఫైనల్ కూడా ఓడలేదు. భారత ప్లేయర్గా 2007 T20 WC, 2011 ODI WC, హెడ్ కోచ్గా ఛాంపియన్స్ ట్రోఫీ(2025), టీ20 WC(2026) సాధించారు. ప్లేయర్గా 2010 ఆసియా కప్ కూడా గెలిచారు. అలాగే IPLలో KKRకి కెప్టెన్గా 2, మెంటార్గా ఒక టైటిల్ అందించారు. కోచ్గా జట్టులో, బ్యాటింగ్ ఆర్డర్లో తరచూ మార్పులు చేస్తున్నారని ఆయనపై విమర్శలొచ్చాయి. కానీ ఆ మార్పులే ఇప్పుడు విజయాన్ని కట్టబెట్టాయి.
News March 9, 2026
భారత మెన్స్ టీమ్ గెలిచిన ICC WCలు

భారత పురుషుల జట్టు ఇప్పటివరకు 5 సార్లు ప్రపంచకప్లు సాధించింది. అందులో రెండు వన్డే WCలు, మూడు T20WCలు ఉన్నాయి. 1983లో వన్డే ప్రపంచకప్, 2007లో టీ20 WC, 2011లో వన్డే ప్రపంచకప్, 2024లో టీ20 WC, 2026లో టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. కపిల్ దేవ్, ధోనీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ల కెప్టెన్సీలో భారత్ ఈ కప్పులు సొంతం చేసుకుంది.


