News February 3, 2025
ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: డీఐఈఓ

నేటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు జనగామ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ జితేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా మొత్తంలో జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 4,714 మంది పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం మొత్తం 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగనున్నాయని తెలిపారు.
Similar News
News December 7, 2025
కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా తోట నవీన్ ఖరారు..?

కాకినాడ జిల్లా టీడీపీ నూతన అధ్యక్షుడిగా తోట నవీన్ పేరు ఖరారైనట్లు జిల్లాలో చర్చ సాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జ్యోతుల నవీన్, తోట నవీన్ మధ్య ఈ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొందని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఎంపీ సానా సతీశ్ బాబు సిఫార్సుతో అధిష్ఠానం తోట నవీన్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. సోమవారం దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
News December 7, 2025
NTR: శబరిమలై స్పెషల్ ట్రైన్స్ నడిచే తేదిలివే.!

శబరిమలై వెళ్లేవారికై విజయవాడ మీదుగా కొల్లం వరకు స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 13న నం.07117 సిర్పూర్ కాగజ్నగర్-కొల్లం, 20న నం.07121 చర్లపల్లి-కొల్లం, 24న నం.07123 H.S. నాందేడ్-కొల్లం, 15న నం.07118 కొల్లం-చర్లపల్లి, 22, 26న నం.07122, నం.07124 కొల్లం-చర్లపల్లి మధ్య ఈ రైళ్లు ప్రయాణిస్తాయన్నారు. ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయన్నారు.
News December 7, 2025
ADB: లక్ష ఖర్చు ఎక్కువైనా పర్లేదు.. మనమే గెలవాలె

పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు డబ్బు, మద్యం, సరుకులతో ఓటర్లకు గాలం వేస్తున్నారు. నామినేషన్ల నుంచి ఖర్చు లెక్కలు పెరుగుతున్నాయి. ఓటర్లు కూడా తమ ఓటుకు ఎక్కువ ధర పలుకుతుండటంతో బేరసారాలకు దిగుతున్నారు. సామాజిక వర్గాల మద్దతు కీలకంగా మారింది. పగలంతా ప్రచారం చేసి రాత్రి అవ్వగానే ఓటర్లకు విందులు, వినోదాలు ఏర్పాటుచేస్తున్నారు. అందరినీ తమతోనే ఉంచుకుంటూ ప్రత్యర్థితో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు.


