News February 14, 2025
ప్రాక్టికల్ పరీక్షలకు 122 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నాలుగో రోజు ప్రశాంతంగా ముగిశాయని ఆర్ఐవో డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన 8 కేంద్రాలను, జిల్లా ఒకేషనల్ విద్యాశాఖ అధికారి 8 కేంద్రాలను, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు 7 కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు 13 కేంద్రాలను తనిఖీ చేశారని తెలిపారు. మొత్తం 122 మంది ఈ పరీక్షలకు గైర్హాజరయ్యారని ఆర్ఐఓ వెల్లడించారు.
Similar News
News December 8, 2025
నెల్లూరు: విష జ్వరాలపై కలెక్టర్ అత్యవసర సమావేశం

జిల్లాలో విష జ్వరాలు ప్రబలుతున్న తరుణంలో కలెక్టర్ హిమాన్షు శుక్ల అత్యవసర సమావేశాన్ని వైద్య ఆరోగ్యశాఖ, GGH వైద్యులతో నిర్వహించారు. బుచ్చి, రాపూరు ప్రాంతాల్లో స్క్రబ్ టైపస్ లక్షణాలతో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరించనప్పటికీ లోపల మాత్రం దీనిపై పునరాలోచనలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ కేసులు పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ చర్చినట్లు తెలిసింది.
News December 8, 2025
నెల్లూరు: రాపిడ్ కిట్లే లేవు..!

జిల్లాను స్క్రబ్ టైపస్ వ్యాధి బేంబేలెత్తిస్తుంది. చాప కింద నీరులా కేసులు విస్తరిస్తున్నాయి. బుచ్చిలో ఓ మహిళ విష జ్వరంతో మృతి చెందింది. ఈమెకు ప్రైవేట్ ఆసుపత్రిలో ర్యాపీడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. స్క్రబ్ టైపస్తో కాదని విష జ్వరంతో అని వైద్య శాఖ కప్పి పుచ్చుకుంటుంది. ర్యాపిడ్ కిట్లు కూడా వైద్యశాఖ వద్ద లేవు. 500 కిట్లు అడిగి ఉన్నామని DMHO చెబుతున్నా ఆ దిశగా చర్యలు లేకపోవడం గమనార్హం.
News December 8, 2025
నెల్లూరులో 100 పడకల ESI హాస్పిటల్

లోక్సభలో సోమవారం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానం ఇస్తూ నెల్లూరులో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్రమంత్రి సుశ్రీ శోభా కరండ్లజే వెల్లడించారు. ఈ మేరకు అయన లిఖితపూర్వకంగా సమాధామిచ్చారు. 100 పడకల ESI ఆసుపత్రిని నెల్లూరులో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే స్థల సేకరణ జరిగిందన్నారు.


