News February 14, 2025

ప్రాక్టికల్ పరీక్షలకు 122 మంది గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నాలుగో రోజు ప్రశాంతంగా ముగిశాయని ఆర్ఐవో డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన 8 కేంద్రాలను, జిల్లా ఒకేషనల్ విద్యాశాఖ అధికారి 8 కేంద్రాలను, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు 7 కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు 13 కేంద్రాలను తనిఖీ చేశారని తెలిపారు. మొత్తం 122 మంది ఈ పరీక్షలకు గైర్హాజరయ్యారని ఆర్ఐఓ వెల్లడించారు.

Similar News

News November 25, 2025

కోటంరెడ్డి సోదరుడి కుమార్తె సంగీత్‌లో భారత క్రికెటర్

image

టీడీపీ నేత, నుడా ఛైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె హరిణ్యా రెడ్డికి గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తో మరో రెండు రోజుల్లో వివాహం జరగనుంది. తాజాగా జరిగిన సంగీత్ వేడుకకు రాహుల్ సిప్లిగంజ్ టీం ఇండియా స్పిన్నర్ చాహల్‌‌ను ఆహ్వానించారు. దీంతో ‘‘నేను చాహల్‌కి వీరాభిమానిని. ఆయన మన సంగీత్‌కు వచ్చారంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నా’’ అంటూ హరిణ్య పోస్టు చేశారు.

News November 25, 2025

ఉదయగిరి: ఇల్లు కట్టుకునేవారికి రూ.2.50 లక్షలు

image

సీఎం చంద్రబాబు సొంత ఇల్లులేని నిరుపేదలందరికీ సొంత ఇల్లు నిర్మించాలని ఉద్దేశంతో పక్కా గృహాలు మంజూరు చేస్తున్నారని ఉదయగిరి నియోజకవర్గ TNTUC అధ్యక్షుడు బొజ్జ శ్రీనివాసులు (గణ) ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నేతృత్వంలో మండలంలోని ప్రతి పేద ఇల్లు నిర్మించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా రూ.2.50 లక్షలు మంజూరు చేస్తారన్నారు. వివరాలకు సచివాలయంలో సంప్రదించాలన్నారు.

News November 25, 2025

కావలి మాజీ MLAకు సర్జరీ.. జగన్ ట్వీట్

image

కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి అనారోగ్య కారణాలతో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని YCP అధినేత జగన్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. ఇటీవల బెంగుళూరులో బైపాస్ సర్జరీ చేయించుకున్న రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నారు.