News February 14, 2025
ప్రాక్టికల్ పరీక్షలకు 122 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నాలుగో రోజు ప్రశాంతంగా ముగిశాయని ఆర్ఐవో డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన 8 కేంద్రాలను, జిల్లా ఒకేషనల్ విద్యాశాఖ అధికారి 8 కేంద్రాలను, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు 7 కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు 13 కేంద్రాలను తనిఖీ చేశారని తెలిపారు. మొత్తం 122 మంది ఈ పరీక్షలకు గైర్హాజరయ్యారని ఆర్ఐఓ వెల్లడించారు.
Similar News
News January 9, 2026
నెల్లూరు జిల్లాలో రూ.6675 కోట్లతో పవర్ ప్లాంట్

నెల్లూరుజిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు IFFCO kisan SEZలో టాటా సంస్థ 6,675 కోట్లతో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. పరిశ్రమను కేటాయించిన సీఎం చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొన్నేళ్లుగా పురోగతి లేని ఇఫ్కో కిసాన్ సెజ్లో పరిశ్రమల రాకతో యువతకు భారీగా ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
News January 9, 2026
NLR: ఒక్క బండితో అక్రమాలు ఆగేది ఎలా?

నెల్లూరు జిల్లాలో 210క్వారీలు ఉండగా 111గనుల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. మరోవైపు అనధికారికంగా ఖనిజాన్ని తవ్వేస్తున్నారు. కనీసం 4మండలాలకు ఓ పర్యవేక్షణ అధికారి ఉంటేనే వీటిపై ఫోకస్ చేయవచ్చు. ప్రస్తుతం జిల్లాలో ఆరుగురే ఉండగా.. తనిఖీలకు వెళ్లడానికి ఒకే ఒక వాహనం ఉంది. మైనింగ్ డిప్యూటీ డెరెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉండగా గూడూరు AD శ్రీనివాసరావు ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు. ఇలాగైతే అక్రమాలను ఎలా అడ్డుకోగలరు?
News January 9, 2026
నెల్లూరు: ఒక్కో తాటాకు రూ.10

భోగి రోజు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు మంటలు వేస్తుంటారు. పల్లెటూర్లో అయితే అడవికి వెళ్లి ఏదో ఒక ఆకు కొట్టుకు వచ్చి మంటలు వేస్తున్నారు. పట్టణాల్లో అలా వేయడం కుదరదు. దీన్నే కొందరు పల్లెటూరు వాసులు క్యాష్ చేసుకుంటున్నారు. తాటాకులను నెల్లూరుకు తెచ్చి విక్రయిస్తున్నారు. ఒక్కో తాటి మట్ట రూ.10లకు, కట్ట రూ.80లకు అమ్ముతున్నారు. ఆకులు కొట్టే కూలీలు, వాటిని అమ్మే వారికి డబ్బులు సమకూరుతున్నాయి.


