News February 14, 2025

ప్రాక్టికల్ పరీక్షలకు 122 మంది గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నాలుగో రోజు ప్రశాంతంగా ముగిశాయని ఆర్ఐవో డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన 8 కేంద్రాలను, జిల్లా ఒకేషనల్ విద్యాశాఖ అధికారి 8 కేంద్రాలను, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు 7 కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు 13 కేంద్రాలను తనిఖీ చేశారని తెలిపారు. మొత్తం 122 మంది ఈ పరీక్షలకు గైర్హాజరయ్యారని ఆర్ఐఓ వెల్లడించారు.

Similar News

News February 21, 2025

ఈ నెల 23న గ్రూప్ 2 పరీక్షలు: కలెక్టర్

image

జిల్లాలో గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ హాలులో గ్రూప్‌-2 పరీక్షల కోఆర్డినేషన్‌ అధికారి, కందుకూరు సబ్‌ కలెక్టర్‌ టి. శ్రీపూజ, డిఆర్‌వో ఉదయభాస్కర్‌రావుతో కలిసి పరీక్షల నిర్వహణపై కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు.

News February 21, 2025

సీఎస్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న నెల్లూరు కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వ సేవలను ప్రజలందరూ సంతృప్తి చెందేలా పారదర్శకంగా అందించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌ అన్నారు. గురువారం సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌, ఎస్పీ కృష్ణకాంత్‌ పాల్గొన్నారు.

News February 20, 2025

నెల్లూరు చేరుకున్న రెవెన్యూ శాఖ కార్యదర్శి

image

రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాం ప్రసాద్ సిసోడియా గురువారం సాయంత్రం నెల్లూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, కావలి, ఆత్మకూరు RDOలు స్వాగతం పలికారు. రేపు రెవెన్యూ అధికారులతో సిసోడియా సమావేశ మవుతారని జిల్లా సమాచార శాఖ అధికారి సదారావు ఒక ప్రకటనలో తెలిపారు.

error: Content is protected !!