News February 18, 2025
ప్రాణాలు తీసిన వాట్సాప్ చాటింగ్

వాట్సాప్ చాటింగ్ బాలుడి ప్రాణాలు తీసిన ఘటన భద్రాద్రి జిల్లాలో జరిగింది. SI రవికుమార్ వివరాల ప్రకారం.. చుంచుపల్లి మం. ఓ తండాకు చెందిన బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. బాలుడికి తన క్లాస్మేట్ బాలికతో స్నేహం ఉండటంతో వాట్సాప్లో చాట్ చేస్తుండేవాడు. బాలిక కుటుంబ సభ్యులు బాలుడిని మందలించారు. దీంతో మనస్తాపం చెంది పురుగుమందు తాగాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News December 7, 2025
తిరుపతి: వర్సిటీలో దారుణం.. రేపు లోక్ సభలో చర్చ.?

తిరుపతి NSU <<18496982>>వివాదంపై<<>> YCP ఎంపీలు లోక్ సభలో చర్చకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ద్వారా లోక్ సభ స్పీకర్ను కోరనున్నారు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
News December 7, 2025
MBNR: కాంగ్రెస్ ప్రజా వంచన పాలన: MP

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో హామీలు అమలుచేయకుండా ప్రజావంచన పాలన కొనసాగిస్తుందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఇందిరాపార్క్ దగ్గర బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆమె పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగభృతి, మహిళలకు రూ.2,500, తులం బంగారం, ఎలక్ట్రికల్ స్కూటీలు తదితర పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు.
News December 7, 2025
ఆదిలాబాద్: ‘అప్పులైనా సరే.. గెలుపే ముఖ్యం’

ADB జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి ఏర్పడింది. రోజు తెల్లవారుజామున నుంచి రాత్రి వరకు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు, ప్రజల మధ్య పరస్పర భేటీ జరుగుతోంది. అప్పులకు పాలవ్వకుండా సర్పంచ్ పదవికి దూరంగా ఉండాలని పలువురు చెపుతున్నప్పటికీ..ఎంత అప్పులైనా సరే, తమకు గెలుపే ముఖ్యం అంటూ ఓ వైపు అభ్యర్థులు అంటున్నారు. ఈ నెల 11న తోలి విడత పోలింగ్ ఉండడంతో కనీసం విశ్రాంతి తీసుకోకుండా ప్రచారాలు చేస్తున్నారు.


