News March 17, 2025
ప్రారంభమైన ఎనుమాముల మార్కెట్.. తగ్గిన పత్తి ధర

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల మార్కెట్ ఈరోజు ప్రారంభం కాగా.. పత్తి బస్తాలను అధిక సంఖ్యలో రైతులు మార్కెట్కు తీసుకువచ్చారు. అయితే తాము ఆశించిన స్థాయిలో ధర రాలేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేడు పత్తి ధర క్వింటాకి రూ.6,825 ధర పలికిందని చెప్పారు. గత వారం పత్తి ధర రూ.6,960 పలకగా ఈరోజు ధరలు భారీగా పడిపోవడంతో పత్తి రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
Similar News
News October 3, 2025
గూడూరు బస్టాండ్లో దిన దిన గండం

కీలకమైన గూడూరు బస్టాండ్ ప్రయాణికుల పాలిట దిన దిన గండంగా మారింది. ప్రయాణికులు వేచి చోట ఉండే స్లాబులు పెచ్చులూడుతున్నాయి. కమ్ములు బయటపడి ఎప్పుడు ఏ పెచ్చు ఊడి పైన పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. RTC ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసిన పట్టించుకోవడం లేదు. అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అనేది ప్రశ్నర్ధకంగా మారింది.
News October 3, 2025
మళ్లీ పెరగనున్న మొబైల్ టారిఫ్లు?

భారతీయ టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది చివరి నాటికి మొబైల్ టారిఫ్లను 10-12 శాతం వరకు పెంచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈక్రమంలో నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇప్పటికే 1GB ప్లాన్లను తొలగించారు. సరసమైన ప్లాన్లు కనిపించట్లేదు. డేటా ప్లాన్లను బలవంతంగా రుద్దుతున్నారు. ధరలు భారీగా పెరిగాయి. అయినా TRAI స్పందించట్లేదు’ అని నెటిజన్లు ఫైరవుతున్నారు. మీ కామెంట్?
News October 3, 2025
KNR: పెరగనున్న మహిళా ప్రాతినిధ్యం..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్ అమలు చేయడంతో మహిళల స్థానాలు విపరీతంగా పెరగనున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 16,42,542 మహిళా ఓటర్లుండగా.. ఇందులో 30 ZPTC స్థానాలకు, 30 MPP స్థానాలకు, 323 MPTC స్థానాలకు, 615 గ్రామపంచాయతీలకు, 6,463 వార్డు సభ్యుల స్థానాలకు మహిళలు ప్రాతినిధ్యం వహించనున్నారు. తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళలకు సముచిత గౌరవం దక్కనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.