News March 22, 2025

ప్రారంభమైన కాజీపేట-విజయవాడ (MEMU) ట్రైన్

image

కాజీపేట నుంచి డోర్నకల్, ఖమ్మం మీదుగా విజయవాడ వరకు వెళ్లే (MEMU) ట్రైన్ నంబర్ 67269) ఈరోజు నుంచి ప్రారంభమైంది. ట్రైన్ ఉ.6:40 ని.లకు బయలుదేరి మధ్యాహ్నం 12: 00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. మూడో లైన్ పనులు, కారణాల వల్ల కొంతకాలంగా ఈ ట్రైన్ నిలిపివేశారు. పనులు పూర్తి కావడంతో ఈ రైలును మళ్లీ పునరుద్ధరించారు.

Similar News

News December 5, 2025

రో-కో భవిష్యత్తును వారు నిర్ణయించడం దురదృష్టకరం: హర్భజన్

image

తమ కెరీర్‌లో పెద్దగా ఏం సాధించని వారు రోహిత్, కోహ్లీ భవిష్యత్తును నిర్ణయిస్తుండటం దురదృష్టకరమని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ వ్యాఖ్యానించారు. తనతో పాటు తన సహచరులకు ఇలాంటి పరిస్థితే ఎదురైందని చెప్పారు. రోహిత్, కోహ్లీ నిరంతరం పరుగులు చేస్తూ బలంగా ముందుకు సాగుతున్నారన్నారు. AUS సిరీస్‌కు ముందు నుంచే కోచ్ గంభీర్‌తో ‘రో-కో’కు పడట్లేదన్న పుకార్ల నడుమ భజ్జీ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.

News December 5, 2025

నాకు బతకాలని లేదు: శ్రీకాకుళం యువతి సూసైడ్

image

విజయనగరం బీసీ హాస్టల్‌లో డిగ్రీ విద్యార్థిని సూసైడ్ కలకలం రేపింది. పోలీసుల వివరాల మేరకు..VZM మహారాజ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్వాతి ఈ బలవన్మరణానికి పాల్పడింది. ఆమెది శ్రీకాకుళం(D)శ్రీకూర్మంగా పోలీసులు గుర్తించారు. తన డైరీలోని ఓ పేజీలో ‘అమ్మ.. నాన్నా నాకు బతకాలని లేదు. ఎందుకో భయమేస్తోంది. నేను ఏ తప్పు చేయలేదు’ అని స్వాతి రాసిన సూసైడ్ నోట్ బయటపడింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 5, 2025

విజయనగరం జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభ‌విస్తే చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో ఎక్క‌డైనా మాతృ, శిశు మ‌ర‌ణాలు సంభ‌విస్తే స‌హించేది లేదని జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. కలెక్టరేట్‌లోని DRC సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్షేత్ర‌స్థాయిలో అత్యున్న‌త ప్ర‌భుత్వ యంత్రాగం ఉంద‌ని, ప్ర‌భుత్వం మంచి పోష‌కాహారాన్ని స‌ర‌ఫ‌రా చేస్తోంద‌ని, అయిన‌ప్ప‌టికీ అక్క‌డ‌క్క‌డా మాతృ, శిశు మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఇక‌ముందు జ‌రిగితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చరించారు.