News February 6, 2025
ప్రియాంక గాంధీని కలిసిన పెద్దపల్లి ఎంపీ

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, యువతకు ఉపాధి అవకాశాలు, ప్రత్యేక నిధుల కేటాయింపుల గురించి ప్రియాంక గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు రాబట్టేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News October 31, 2025
2,162 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

RRC నార్త్ వెస్ట్రర్న్ రైల్వేలో 2,162 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100, SC, ST, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://rrcjaipur.in
News October 31, 2025
సీఎం చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు సరికాదు: తిక్కారెడ్డి

‘మొంథా’ తుఫాను సమయంలో ప్రజలను కాపాడిన సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని జగన్ తప్పుబట్టడం ఆశ్చర్యకరమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి శుక్రవారం విమర్శించారు. తుఫాన్ సమయంలో ప్రాణ నష్టం లేకుండా చూసిన చంద్రబాబుపై వ్యాఖ్యలు చేయడం జగన్కు తగదన్నారు. సీఎంగా ఉన్నప్పుడు తుఫాన్లు వచ్చినా గడప దాటని జగన్, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు.
News October 31, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

బంగారం ధరలు గంటల వ్యవధిలోనే <<18156666>>మరోసారి<<>> పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఇవాళ మొత్తంగా రూ.1,800 పెరిగి ₹1,23,280కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,650కు ఎగబాకి రూ.1,13,000 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


