News April 15, 2025

ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు అరెస్ట్: సీఐ

image

ప్రియుడిని గొంతునులిమి హత్య చేసిన ప్రియురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఖమ్మం ఖానాపురం సీఐ భానుప్రసాద్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. ఖమ్మంకు చెందిన లావణ్య(35) తన భర్తతో విడిపోయి సత్తుపల్లిలో రవిప్రసాద్‌తో సహజీవనం చేస్తూ నివాసముంటుంది. కాగా తరచూ రవి ప్రసాద్ లావణ్యతో మద్యం తాగి తరచూ గొడవపడేవాడు. ఈ నెల 6న మద్యం మత్తులో ఉన్న ప్రసాద్‌ను గొంతునులిమి హత్య చేసిందని పేర్కొన్నారు.

Similar News

News November 14, 2025

మెదక్ జిల్లాలో కవిత పర్యటన

image

కవిత జాగృతి జనంబాట నేటి నుంచి మెదక్ జిల్లాలో ప్రారంభం కానుంది. నర్సాపూర్ నలంద స్కూల్లో చిల్డ్రన్స్ డే వేడుకల్లో పాల్గొంటారు. రెడ్డిపల్లిలో రీజనల్ రింగ్ రోడ్డు, కాల్వలు, హై టెన్షన్ లైన్ కోసం భూములు కోల్పోయిన బాధితులతో సమావేశం. పోతన్ శెట్టిపల్లిలో వివిధ పార్టీల నుంచి జాగృతి చేరికలు, ఘణపూర్ ఆనకట్ట సందర్శన, ఏడుపాయల వన దుర్గా అమ్మవారి దర్శనం, మెదక్ చర్చ్, పల్లికొట్టాల డబుల్ బెడ్ రూం సందర్శిస్తారు.

News November 14, 2025

వరంగల్: రైతులకు కొరకరాని కొయ్యగా మారిన కొత్త నిబంధనలు!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పత్తి కొనుగోలు నిబంధనలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సీసీఐ అధికారులు ఒక్కో రైతు ఒక ఎకరానికి కేవలం 7 క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేయాలని మార్గదర్శకాలు జారీ చేయడంతో ఎక్కువ దిగుబడి సాధించిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, కపాస్ యాప్ ద్వారా మాత్రమే స్పాట్‌ బుకింగ్‌ చేయాలనే నియమం రైతుల ముందున్న మరో అడ్డంకిగా మారింది.

News November 14, 2025

బిహార్ కౌంటింగ్.. వీడనున్న సస్పెన్స్!

image

బిహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలతో పలు రాష్ట్రాల్లోని ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. బిహార్‌లో మొత్తం 2,616 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 38 జిల్లాల్లోని 46 సెంటర్లలో కౌంటింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపునకు ఈసీ 4,372 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు.