News March 27, 2025

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో బోధన: VKB కలెక్టర్

image

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆంగ్ల బోధన చేసి పిల్లలు ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడటం హర్షించదగిన విషయమని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో యంగ్ ఓరేటర్స్ క్లబ్, బొస్చ్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో విద్యా కదంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల బోధన చేస్తున్నారని వివరించారు.

Similar News

News April 20, 2025

గుజరాత్‌లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ

image

AP: మంత్రి నారాయణ బృందం ఇవాళ అహ్మదాబాద్‌కు చేరుకుంది. అక్కడి నుంచి ఏక్తానగర్‌కు మంత్రి బస్సులో ప్రయాణించారు. ఏక్తానగర్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. విగ్రహ నిర్మాణానికి సంబంధించిన వివరాలు, ప్రత్యేకతలు అక్కడి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అమరావతిలో భారీ విగ్రహాల నిర్మాణం కోసం పటేల్ విగ్రహ నిర్మాణ తీరును మంత్రి బృందం అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తోంది.

News April 20, 2025

కొత్తగూడెం: ఇళ్ల తప్పుడు లెక్కలు.. ఉద్యోగి సస్పెండ్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కొత్తగూడెం జిల్లాలో అవకతవకలు వెలుగుచూశాయి. భద్రాచలం గ్రామపంచాయతీ పరిధిలో 18 మంది లబ్ధిదారులకు సంబంధించి, విధుల్లో ఉన్న వ్యక్తి బేస్‌మెంట్ స్థాయి నిర్మాణం పూర్తికానప్పటికీ, తప్పుడు వివరాలు నమోదు చేశారని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతణ్ని విధుల నుంచి తొలగించారు. అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని కలెక్టర్ స్పష్టంచేశారు.

News April 20, 2025

విభేదాలు పరిష్కరించుకుంటే మంచిదే: దేవేంద్ర ఫడణవీస్

image

రాజ్ ఠాక్రేతో కలిసి పని చేసేందుకు సిద్ధమేనన్నఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలపై MH సీఎం దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. ‘ఇద్దరు కలిస్తే సంతోషమే, విభేదాలను పరిష్కరించుకోవడం మంచి విషయం’ అని సీఎం అన్నారు. కాగా MNSతో పొత్తులపై చర్చలు జరగలేదని శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఇద్దరూ సోదరులని రాజకీయంగా విభేదాలున్నప్పటికీ అన్నదమ్ముల బంధం తెగిపోదని అన్నారు.

error: Content is protected !!