News April 9, 2025
ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు: స్పీకర్ అయ్యన్న

ప్రసవం కోసం పీ.హెచ్.సీలకు వస్తున్న కేసులను ఆశ కార్యకర్తలు నర్సీపట్నంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి కమిషన్లు పొందుతున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. మంగళవారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం కలెక్టర్ విజయకృష్ణన్ సమక్షంలో నిర్వహించారు. వివిధ పీహెచ్సీల నుంచి 2023-24లో 398, 2024-25లో 498 ప్రసూతి కేసులను ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారని వెల్లడించారు.
Similar News
News February 27, 2026
పాడి పశువులను కొనే ముందు జాగ్రత్తలు

పాడి పశువును కొనే సమయానికి అది 2వ ఈతలో ఉండాలి. ఏ సమస్యా లేకుండా ఈనిన ఆరోగ్యమైన పశువును 15 రోజుల లోపు కొనుగోలు చేయాలి. ధరను పాల ఉత్పత్తిని బట్టి నిర్ణయించాలి. పశువును కొనేముందు మొదటిసారి తీసిన పాలను లెక్కలోకి తీసుకోకూడదు. రెండో రోజు ఉదయం, సాయంత్రం తీసిన పాలను లెక్కలోకి తీసుకోవాలి. లీటరు డబ్బాలతో పాలను కొలవాల్సి వస్తే పాలపై నురగని పూర్తిగా తీసివేయాలి. అన్ని పశువులను ఒకేసారి కొనకపోవడం మంచిది.
News February 27, 2026
ఆరుట్ల మోడల్.. 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్!

TG: రంగారెడ్డి(D) ఆరుట్ల స్కూల్ తరహాలో 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్(TPS) ప్రారంభించాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. క్లాస్ రూములు, గ్రౌండ్, ట్రాన్స్పోర్ట్, టీచింగ్ స్టాఫ్ వంటి సకల వసతులు ఉండేలా చూడాలన్నారు. ఇక HYDలో 12 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏడాదిలోగా పూర్తి చేయాలని సూచించారు. నాణ్యమైన విద్య కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడబోమని స్పష్టం చేశారు.
News February 27, 2026
గంగా జలం ఇంటికి తెచ్చుకుంటున్నారా?

గంగా జలం ఇంట్లో ఉంటే చాలా మంచిది. అయితే పుణ్య క్షేత్రాల నుంచి ఆ జలాన్ని తెచ్చేటప్పుడు చాలామంది ప్లాస్టిక్ బాటిళ్లు వాడుతుంటారు. దాని బదులు ఇత్తడి పాత్రలు వాడితే ఆ జలంలోని ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘గంగా జలం వాస్తు దోషాలను, ప్రతికూల శక్తులను పోగొడుతుంది. గ్రహణాల తర్వాత, శుభకార్యాలప్పుడు ఇంటిని శుద్ధి చేయడానికి దీనిని ప్రోక్షించడం వల్ల సానుకూలత పెరుగుతుంది’ అంటున్నారు.


