News November 26, 2024
ప్రొద్దటూరు: బీరు సీసాతో వ్యక్తిపై దాడి

పని డబ్బులు అడిగినందుకు తోటి కూలి బీరు సీసాతో దాడి చేసిన ఘటన ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మహ్మద్, ఉపేంద్ర కలిసి పెయింట్ పనికి వెళ్లేవారు. ఒక రోజు ఇద్దరు పనికి వెళ్లగా.. వచ్చిన డబ్బు మొత్తాన్ని ఉపేంద్ర తీసుకున్నాడు. సోమవారం రాత్రి ఓ చోట ఉపేంద్ర కనిపించగా మహ్మద్ తన డబ్బు ఇవ్వాలని పదే పదే డిమాండ్ చేశాడు. కోపంతో ఆగ్రహించిన ఉపేంద్ర బీరు సీసాతో అతని కడుపులో పొడిచి పరారయ్యాడు.
Similar News
News November 2, 2025
ప్రొద్దుటూరు: అక్టోబర్లో రూ.65.07 కోట్ల మద్యం విక్రయం

గత నెలలో ప్రొద్దుటూరు IMFL డిపోలో రూ.65.07 కోట్ల విలువైన మద్యం విక్రయించినట్లు అధికారులు తెలిపారు. బద్వేల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రూ.10.28 కోట్లు, జమ్మలమడుగు రూ.7.30 కోట్లు, ముద్దనూరు రూ.3.58 కోట్లు, మైదుకూరు రూ.8.77 కోట్లు, ప్రొద్దుటూరు రూ.16.65 కోట్లు, పులివెందుల రూ.11.22 కోట్లు, ఎర్రగుంట్లలో రూ.7.23 కోట్ల మద్యం విక్రయించారు. 91,291 కేసుల IML మద్యం, 39,902 కేసుల బీరు విక్రయించినట్లు చెప్పారు.
News November 2, 2025
ప్రొద్దుటూరు: గతనెలలో రూ.65.07 కోట్ల మద్యం విక్రయం

గత నెలలో ప్రొద్దుటూరు IMFL డిపోలో రూ.65.07 కోట్ల విలువైన మద్యం విక్రయించినట్లు అధికారులు తెలిపారు. బద్వేల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రూ.10.28 కోట్లు, జమ్మలమడుగు రూ.7.30 కోట్లు, ముద్దనూరు రూ.3.58 కోట్లు, మైదుకూరు రూ.8.77 కోట్లు, ప్రొద్దుటూరు రూ.16.65 కోట్లు, పులివెందుల రూ.11.22 కోట్లు, ఎర్రగుంట్లలో రూ.7.23 కోట్ల మద్యం విక్రయించారు. 91,291 కేసుల IML మద్యం, 39,902 కేసుల బీరు విక్రయించినట్లు చెప్పారు.
News November 1, 2025
కడప: హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వెంకట జ్యోతిర్మయి ప్రతాపను ఎస్పీ నచికేత్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కడపలోని స్టేట్ గెస్ట్ హౌస్లో వారు కలుసుకున్నారు. జిల్లాలో శాంతిభద్రతల విషయం గురించి ఎస్పీ వివరించారు. జిల్లాలో శాంతిభద్రతల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎస్పీ తెలిపారు.


