News November 26, 2024
ప్రొద్దటూరు: బీరు సీసాతో వ్యక్తిపై దాడి

పని డబ్బులు అడిగినందుకు తోటి కూలి బీరు సీసాతో దాడి చేసిన ఘటన ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మహ్మద్, ఉపేంద్ర కలిసి పెయింట్ పనికి వెళ్లేవారు. ఒక రోజు ఇద్దరు పనికి వెళ్లగా.. వచ్చిన డబ్బు మొత్తాన్ని ఉపేంద్ర తీసుకున్నాడు. సోమవారం రాత్రి ఓ చోట ఉపేంద్ర కనిపించగా మహ్మద్ తన డబ్బు ఇవ్వాలని పదే పదే డిమాండ్ చేశాడు. కోపంతో ఆగ్రహించిన ఉపేంద్ర బీరు సీసాతో అతని కడుపులో పొడిచి పరారయ్యాడు.
Similar News
News July 8, 2025
కడప SP పరిష్కార వేదికకు 178 ఫిర్యాదులు

ఫిర్యాదుదారులకు చట్టపరమైన న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశించారు. సోమవారం కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (PGRS)లో 178 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ పలు సమస్యలపై స్వయంగా విచారణ జరిపి, సంబంధిత అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులకు పోలీస్ సిబ్బంది సహాయం అందించారు.
News July 7, 2025
అర్జీలు స్వీకరించిన కడప ఎంపీ

పులివెందులలోని తన నివాసంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని కోరారు.
News July 7, 2025
పులివెందుల: స్తంభంపైనే చనిపోయాడు

పులివెందులలో విషాద ఘటన జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని ఉలిమెళ్ల సమీపంలో కరెంట్ పనులు చేయడానికి లైన్మెన్ శివారెడ్డి ఎల్సీ తీసుకున్నాడు. స్తంభంపై పనిచేస్తుండగా షాక్ కొట్టడంతో అక్కడే చనిపోయాడు. అధికారుల నిర్లక్ష్యంతో కరెంట్ సరఫరా జరిగిందా? వేరే కారణమా? అనేది తెలియాల్సి ఉంది.