News November 26, 2024

ప్రొద్దటూరు: బీరు సీసాతో వ్యక్తిపై దాడి

image

పని డబ్బులు అడిగినందుకు తోటి కూలి బీరు సీసాతో దాడి చేసిన ఘటన ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మహ్మద్, ఉపేంద్ర కలిసి పెయింట్ పనికి వెళ్లేవారు. ఒక రోజు ఇద్దరు పనికి వెళ్లగా.. వచ్చిన డబ్బు మొత్తాన్ని ఉపేంద్ర తీసుకున్నాడు. సోమవారం రాత్రి ఓ చోట ఉపేంద్ర కనిపించగా మహ్మద్ తన డబ్బు ఇవ్వాలని పదే పదే డిమాండ్ చేశాడు. కోపంతో ఆగ్రహించిన ఉపేంద్ర బీరు సీసాతో అతని కడుపులో పొడిచి పరారయ్యాడు.

Similar News

News January 13, 2026

మూడవరోజు గండికోట ఉత్సవాల షెడ్యూల్ ఇదే..!

image

* ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు అడ్వెంచర్ యాక్టివిటీస్-హెలిరైడ్, పారామోటార్ గ్లైడింగ్
* సాయంత్రం 4-7 వరకు కవిత్వం, కథ చెప్పడం, ఫోటోగ్రఫీ, స్కెచింగ్, పెయింటింగ్, లాగింగ్, వంటల పోటీలు
* సాయంత్రం 7 గంటలకు మిమిక్రి, జానపద గేయాలు, చెక్క భజన, క్లాసికల్ డాన్స్, యక్ష గానం, బృందావనం-సౌండ్, లైట్&లేజర్ షో
* 7:20-9 వరకు శివమణి మ్యూజికల్ నైట్
* రాత్రి 9లకు ఫైర్ వర్క్స్
*9:30కి ఉత్సవాల ముగింపు

News January 12, 2026

వీఎన్ పల్లె తహశీల్దార్‌కు షోకాజ్ నోటీసులు

image

పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన వీఎన్ పల్లె తహశీల్దార్ లక్ష్మీదేవితో పాటు మరో 11 మందికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీలోగా గ్రామసభల ద్వారా రైతులకు పుస్తకాలు అందజేయాలని ఆదేశించినా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

News January 12, 2026

జిల్లా పోలీస్ కార్యాలయానికి 74 అర్జీలు

image

కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను(PGRS) జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రకాష్ రావు నిర్వహించారు. బాధితుల నుంచి 74 పిర్యాదులను ఆయన స్వీకరించారు. సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి
వాటిని పరిశీలించాలని ఆయన ఆదేశించారు. త్వరితగతిన అర్జీలను పరిష్కారం చేయాలని సూచించారు. బాధితులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు.