News December 12, 2024
ప్రొద్దుటూరులో పొలిటికల్ హీట్

ప్రొద్దుటూరులో భూమికి సంబంధించిన వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ పెరిగింది. తాను ఒక్క ఎకరా భూమిని ఆక్రమించినట్లు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. రాచమల్లు భూ బాధితులు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయొచ్చు. అలా చేస్తే రాచమల్లుపై చర్యలు తీసుకుంటామని టీడీపీ నాయకులు ఈవీ సుధాకర్, నల్లబోతుల నాగరాజు ప్రజలకు పిలుపునిచ్చారు.
Similar News
News July 7, 2025
కడప జిల్లాల్లో 159 మంది అరెస్ట్

కడప జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ వెల్లడించారు. ‘జిల్లాలో గత 15 రోజుల్లో జూదమాడుతున్న 159 మందిని అరెస్టు చేశాం. రూ. 2.85 లక్షలు స్వాధీనం చేసుకున్నాం. 9మట్కా కేసుల్లో 16మందిని అరెస్టు చేసి రూ.50,570 సీజ్ చేశాం. రూ.1.4కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నాం. బహిరంగంగా మద్యం తాగిన 986 మందిపై కేసులు నమోదు చేశాం’ అని SP చెప్పారు.
News July 6, 2025
రైతులకు అవగాహన కల్పించండి: కడప కలెక్టర్

కడప జిల్లాలో ఈనెల 14వ తేదీ వరకు జరిగే పశుగ్రాస వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. పశుగ్రాస వారోత్సవాల గోడపత్రికలను ఆయన కడపలో ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పశుగ్రాసాలను సాగు చేసి రైతుల ఇంట సిరుల పండించేలా చూడాలన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పశుగ్రాసాల సాగు ఎంతో ఉపయోగకరమని ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు.
News July 6, 2025
వేంపల్లి: ట్రాక్టర్ ఢీ.. 50 గొర్రెలు మృతి

కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లి- తాళ్లపల్లి మధ్యలో ట్రాక్టర్ ఢీకొని 50 గారెలు మృతి చెందినట్లు సమాచారం. ఈ గొర్రెలు తాటిమాకులపల్లె ఎస్సీ కాలనీకి చెందిన వారివిగా గుర్తించారు. వీరంతా తాళ్లపల్లిలో మేపుకోసం వెళ్తున్నారు. అటుగా స్పీడుగా వచ్చిన ట్రాక్టర్ గొర్రెలను ఢీకొనగా అక్కడికక్కడే 50 గొర్రెలు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.