News November 17, 2025
ప్రొద్దుటూరు అంటే భయపడుతున్న అధికారులు..?

ప్రొద్దుటూరులో పనిచేయాలంటే అధికారులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేసిన 43మంది అధికారులపై ఇప్పుడు విచారణకు ఆదేశించారు. ఇక్కడి హౌసింగ్ శాఖలోని నలుగురు సిబ్బందిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు ఇక్కడి అధికారులను ఇష్టారీతిగా వాడుకుంటున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారినప్పుడల్లా ఆ అధికారులు ఇబ్బంది పడుతున్నారు.
Similar News
News April 5, 2026
నేడు ఒంటిమిట్ట రామయ్యకు పుష్పయాగం

ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ముగియడంతో నేడు(ఆదివారం) రాత్రి రామాలయంలో వేదపండితులు, అర్చకులు సంప్రదాయంగా పుష్పయాగం, ఏకాంతసేవ నిర్వహించనున్నారు. ఆలయంలోని దక్షిణ ఈశాన్య మూల ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి, వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన ప్రత్యేక చినపుష్పాలతో ఈ కార్యక్రమాన్ని వేడుకగా జరిపించనున్నారు.
News April 5, 2026
ప్రొద్దుటూరు శివాలయం ఇంటి దొంగలపై విచారణ!

ప్రొద్దుటూరు అగస్త్యేశ్వరాలయం (శివాలయం) ఇంటి దొంగలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అమ్మవారి బంగారు హారం, స్వామివారి వెండి వస్తువులు, సుమారు రూ. కోటి డబ్బులు మాయమయ్యాయి. వీటిపై ఎండోమెంట్ కర్నూల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం సూపరింటెండెంట్ తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో ఏడు మంది అధికారుల బృందాన్ని విచారణకు నియమించారు. వీరు సోమవారం విచారణకు వస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ నారాయణరెడ్డి తెలిపారు.
News April 5, 2026
ప్రొద్దుటూరు శివాలయం ఇంటి దొంగలపై విచారణ!

ప్రొద్దుటూరు అగస్త్యేశ్వరాలయం (శివాలయం) ఇంటి దొంగలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అమ్మవారి బంగారు హారం, స్వామివారి వెండి వస్తువులు, సుమారు రూ. కోటి డబ్బులు మాయమయ్యాయి. వీటిపై ఎండోమెంట్ కర్నూల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం సూపరింటెండెంట్ తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో ఏడు మంది అధికారుల బృందాన్ని విచారణకు నియమించారు. వీరు సోమవారం విచారణకు వస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ నారాయణరెడ్డి తెలిపారు.


