News July 13, 2024
ప్రొద్దుటూరు: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

మైలవరం మం, దొడియంకు చెందిన రేష్మ(25)కు 10 ఏళ్ల క్రితం అమృత నగర్కు చెందిన అన్వర్ బాషాతో ప్రేమ వివాహం జరిగింది. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని భర్త అనుమానం పెంచుకున్నాడు. 10 రోజుల క్రితం భర్తతో గొడవ పడి ఆమె తన పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. శుక్రవారం భర్త ఆమె వద్దకు వెళ్లి సరదాగా పార్కు వెళ్దామంటూ పిలిచాడు. ఎకో పార్కుకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపి పూడ్చి పెట్టి, స్టేషన్లో లొంగిపోయాడు.
Similar News
News February 19, 2025
కడప జిల్లా TODAY టాప్ న్యూస్

➣ కడప: ‘ముస్లింలు అంటే సీఎంకు చిన్నచూపు’
➣ గోపవరం: గుండెపోటుతో 24 ఏళ్ల యువకుడు మృతి
➣ సిద్దవటం మండలంలో భారీ చోరీ
➣ 22న ప్రొద్దుటూరులో మినీ జాబ్ మేళా
➣ లింగాలలో పట్టుబడిన చీనీ కాయల దొంగలు
➣ కడప జిల్లాలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు
➣ కమలాపురం: నలుగురి పిల్లలతో తల్లి జీవన పోరాటం
➣ గండికోటలో సెల్ఫీ తీసుకున్న కలెక్టర్, MLA
➣ జగన్పై జమ్మలమడుగు MLA ఫైర్
News February 19, 2025
కడప జిల్లాలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు

కడప జిల్లా పరిధిలో ఇవాళ్టి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ప్రతి మండలంలో సెలక్ట్ చేసిన సచివాలయాల్లో ఆధార్ సేవలు అందిస్తారు. కొత్తగా ఆధార్ కార్డు నమోదు, పాత కార్డులో వివరాల అప్డేట్, మొబైల్ లింకింగ్, చిన్న పిల్లల ఆధార్ నమోదు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. మీకు దగ్గరలోని సచివాలయాలను సంప్రదిస్తే.. ఏ సచివాలయంలో ఆధార్ సేవలు అందిస్తారో మీకు చెబుతారు.
News February 19, 2025
గండికోటలో సెల్ఫీ తీసుకున్న అజయ్ జైన్, కలెక్టర్, MLA

గండికోటను ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, ఇక్కడ వనరులు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. ఇక్కడి ప్రకృతి ఆస్వాదించారు. అనంతరం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో గండికోట లోయ అందాల వద్ద సెల్ఫీ దిగారు.