News September 24, 2024
ప్రొద్దుటూరు: తండ్రి హత్య కేసులో.. ముగ్గురికి యావజ్జీవ శిక్ష

ఆస్తి, అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని తండ్రిని హత్య చేసిన కేసులో మంగళవారం ప్రొద్దుటూరు 2nd ADJ జడ్జి GS రమేశ్ కుమార్ ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. కడప హోటల్ లక్ష్మీ భవన్ యజమాని ముద్దంశెట్టి వెంకటసుబ్బయ్యను ఆయన చిన్న కొడుకు శివ ప్రసాద్, జనార్ధన్, పెద్దకోడలు సుప్రజ, 2014 డిసెంబర్ 30న హత్య చేశారు. నేరం రుజువు కావడంతో జడ్జి ముగ్గురికి యావజ్జీవ శిక్ష, రూ.4 లక్షలు జరిమానా విధించారు.
Similar News
News November 18, 2025
గండికోటలో ప్రమాదాల అంచున సెల్ఫీ

గండికోట ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం. యువకులు, విద్యార్థులు, పెద్దలు, కొందరు పర్యాటకులు గండికోటను దర్శిస్తుంటారు. ఇక్కడ లోయ ఉండడంతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంటుంది. రెండు కొండల మధ్య లోయ చుపరులను ఆకట్టుకుంటూ కనువిందు చేస్తుంటుంది. ఈ దృశ్యాన్ని తిలకిస్తూ ప్రమాదపు అంచున ఫొటోలు దిగుతూ ఉంటారు. అధికారులు ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.
News November 18, 2025
గండికోటలో ప్రమాదాల అంచున సెల్ఫీ

గండికోట ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం. యువకులు, విద్యార్థులు, పెద్దలు, కొందరు పర్యాటకులు గండికోటను దర్శిస్తుంటారు. ఇక్కడ లోయ ఉండడంతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంటుంది. రెండు కొండల మధ్య లోయ చుపరులను ఆకట్టుకుంటూ కనువిందు చేస్తుంటుంది. ఈ దృశ్యాన్ని తిలకిస్తూ ప్రమాదపు అంచున ఫొటోలు దిగుతూ ఉంటారు. అధికారులు ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.
News November 18, 2025
జమ్మలమడుగు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి కేనా..?

మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాలిటిక్స్లో మళ్లీ యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు పార్టీ కార్యక్రమాలు కొన్నింట్లో పాల్గొని, మరి కొన్నింట్లో కనిపించకుండా పోయారు. దీంతో ఆయన పాలిటిక్స్కు దూరం అయ్యారనే గుసగుసలు వినిపించాయి. అయితే వారం రోజుల నుంచి ఆయనకు సంబంధించిన అభిమానులు, నాయకులు ‘BOSS IS BACK’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆయనకే నియోజకవర్గ బాధ్యతలు కూడా ఇస్తారనే టాక్ నడుస్తోంది.


