News September 24, 2024

ప్రొద్దుటూరు: తండ్రి హత్య కేసులో.. ముగ్గురికి యావజ్జీవ శిక్ష

image

ఆస్తి, అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని తండ్రిని హత్య చేసిన కేసులో మంగళవారం ప్రొద్దుటూరు 2nd ADJ GS రమేశ్ కుమార్ ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. కడప హోటల్ లక్ష్మీ భవన్ యజమాని ముద్దంశెట్టి వెంకటసుబ్బయ్యను ఆయన చిన్న కొడుకు శివ ప్రసాద్, జనార్దన్, పెద్దకోడలు సుప్రజ, 2014 డిసెంబర్ 30న హత్య చేశారు. నేరం రుజువు కావడంతో జడ్జి ముగ్గురికి యావజ్జీవ శిక్ష, రూ.4 లక్షలు జరిమానా విధించారు.

Similar News

News November 28, 2025

కడప జిల్లా ప్రజలకు తుఫాన్ హెచ్చరికలు

image

దిత్వా తుఫాను ప్రభావంతో శనివారం కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి ప్రజల సెల్ ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు సమాచారంతో వరి కోత పనులు నూర్పిడి చేసే రైతులు జాగ్రత్తలు పడుతున్నారు.

News November 28, 2025

కడప: 4న వాలీబాల్ సెలెక్షన్ ట్రైయిల్స్

image

దక్షిణ భారత అంతర విశ్వ విద్యాలయాల వాలీబాల్ పోటీలలో పాల్గొనబోయే విశ్వ విద్యాలయ వాలీబాల్ స్త్రీ, పురుషులు జట్ల కోసం డైరెక్ట్ సెలెక్షన్ ట్రయల్స్ డిసెంబర్ 4వ తేదీ నిర్వహిస్తున్నారు. క్రీడాకారులు సంబంధిత సర్టిఫికెట్‌లతో హాజరు కావాలని సూచించారు. ఎంపికలు విశ్వ విద్యాలయ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తామని వైవీయు క్రీడా బోర్డు కార్యదర్శి డా. కొవ్వూరు రామసుబ్బారెడ్డి తెలిపారు.

News November 28, 2025

కడప: 4న వాలీబాల్ సెలెక్షన్ ట్రైయిల్స్

image

దక్షిణ భారత అంతర విశ్వ విద్యాలయాల వాలీబాల్ పోటీలలో పాల్గొనబోయే విశ్వ విద్యాలయ వాలీబాల్ స్త్రీ, పురుషులు జట్ల కోసం డైరెక్ట్ సెలెక్షన్ ట్రయల్స్ డిసెంబర్ 4వ తేదీ నిర్వహిస్తున్నారు. క్రీడాకారులు సంబంధిత సర్టిఫికెట్‌లతో హాజరు కావాలని సూచించారు. ఎంపికలు విశ్వ విద్యాలయ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తామని వైవీయు క్రీడా బోర్డు కార్యదర్శి డా. కొవ్వూరు రామసుబ్బారెడ్డి తెలిపారు.