News January 20, 2025

ప్రొద్దుటూరు: ‘ప్రభుత్వం అప్పులు, ఖర్చులను తెలపాలి’

image

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను, ఖర్చులను మీడియా ద్వారా ప్రజలకు తెలపాలని ప్రజాపక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి తెలిపారు. సోమవారం ప్రొద్దుటూరు తహశీల్దార్ గంగయ్యకు ఆయన వినతిపత్రం అందించారు. లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు వివిధ రకాల పన్నుల ద్వారా చెల్లించిన సొమ్మును ప్రభుత్వం అప్పులకు చెల్లిస్తోందన్నారు. ప్రతినెల ప్రభుత్వం చేస్తున్న ఖర్చులను, అప్పులను ప్రజలకు వివరించాలన్నారు.

Similar News

News November 25, 2025

ప్రొద్దుటూరు జీరో వ్యాపారంపై ఐటీ ఆరా.!

image

ప్రొద్దుటూరు జీరో వ్యాపారంపై జీఎస్టీ, ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రొద్దుటూరు బంగారు వ్యాపారి శ్రీనివాసులు కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ కేసులో చీటింగ్, కిడ్నాప్, దాడులు జరిగాయి. దీంతో ఇక్కడికి బంగారం సరఫరా చేసిన సేట్లు, ఆభరణాలు కొనుగోలు చేసిన వినియోగదారులు జీరోలోనే వ్యాపారం సాగిస్తున్నట్లు వెల్లడైంది. ఈ వ్యాపారాలకు పన్ను చెల్లింపులపై జీఎస్టీ, ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.

News November 25, 2025

ప్రొద్దుటూరు జీరో వ్యాపారంపై ఐటీ ఆరా.!

image

ప్రొద్దుటూరు జీరో వ్యాపారంపై జీఎస్టీ, ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రొద్దుటూరు బంగారు వ్యాపారి శ్రీనివాసులు కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ కేసులో చీటింగ్, కిడ్నాప్, దాడులు జరిగాయి. దీంతో ఇక్కడికి బంగారం సరఫరా చేసిన సేట్లు, ఆభరణాలు కొనుగోలు చేసిన వినియోగదారులు జీరోలోనే వ్యాపారం సాగిస్తున్నట్లు వెల్లడైంది. ఈ వ్యాపారాలకు పన్ను చెల్లింపులపై జీఎస్టీ, ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.

News November 25, 2025

పులివెందులలో YS జగన్

image

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం సాయంత్రం పులివెందులకు చేరుకున్నారు. జన సందోహం మధ్య ప్రజలకు అభివాదం చేసుకుంటూ బాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. జగన్ పులివెందులకు రావడంతో క్యాంప్ కార్యాలయం వద్ద జన సందడి నెలకొంది. ఆయనను జిల్లా నేతలు కలిశారు.