News January 20, 2025
ప్రొద్దుటూరు: ‘ప్రభుత్వం అప్పులు, ఖర్చులను తెలపాలి’

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను, ఖర్చులను మీడియా ద్వారా ప్రజలకు తెలపాలని ప్రజాపక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి తెలిపారు. సోమవారం ప్రొద్దుటూరు తహశీల్దార్ గంగయ్యకు ఆయన వినతిపత్రం అందించారు. లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు వివిధ రకాల పన్నుల ద్వారా చెల్లించిన సొమ్మును ప్రభుత్వం అప్పులకు చెల్లిస్తోందన్నారు. ప్రతినెల ప్రభుత్వం చేస్తున్న ఖర్చులను, అప్పులను ప్రజలకు వివరించాలన్నారు.
Similar News
News February 18, 2025
కడప: రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత మృతి

నందలూరులో సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉమ్మడి కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాకకు చెందిన టీడీపీ నేత కొమ్మినేని ప్రసాద్ (46) గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడు, క్షత్రియ సంఘం రాష్ట్ర డైరెక్టర్ ప్రతాప్ రాజు మంచి కార్యకర్తను కోల్పోయామన్నారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
News February 18, 2025
ముద్దనూరులో రోడ్డు ప్రమాదం

ముద్దనూరు మండలంలోని తిమ్మాపురం గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కడప నుంచి గండికోట వెళ్తుండగా ఇన్నోవా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 18, 2025
ప్రతి ఒక్కరూ ప్రజలకు న్యాయం చేయాలి: ఎస్పీ

న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరికీ అధికారులు విచారించి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులకు ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తూ ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం చేయకుండా విచారించి సత్వరమే న్యాయం చేయాలన్నారు.