News June 20, 2024

ప్రొద్దుటూరు: 2,893 మద్యం బాటిళ్లు ధ్వంసం

image

ప్రొద్దుటూరులో గురువారం 2,893 మద్యం బాటిళ్లను కడప సెబ్ ఎన్ఫోర్స్ మెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు నాయుడు సమక్షంలో ధ్వంసం చేశారు. ప్రొద్దుటూరు రూరల్, వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లు, రాజుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం తరలిస్తున్న 98 కేసుల్లో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. సీఐలు రమణారెడ్డి, శ్రీకాంత్, అబ్దుల్ కరీం, మహేష్ కుమార్ పాల్గొన్నారు.

Similar News

News November 26, 2025

కడప జిల్లాలో 201 మంది హౌసింగ్ ఉద్యోగులకు జీతాలు నిలిపివేత

image

కడప జిల్లాలో 201 మంది హౌసింగ్ ఉద్యోగులకు నవంబర్ నెల జీతాలు నిలిపివేస్తూ ఆ శాఖ ఎండీ అరుణ్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో ‘ఫేజ్-3’లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లోని లోపాలపై ఇటీవల పరిశీలన చేపట్టారు. ఈ నివేదిక ఆధారంగా జిల్లాలో 6,298 ఇళ్ల నిర్మాణాలకు అదనపు చెల్లింపు జరిగినట్లు గుర్తించారు. ఇందుకు 30 మంది ఏఈఎస్‌లు, 171 మంది ఈఏ/డబ్ల్యూఏఎస్‌లను బాధ్యులను చేస్తూ ఈ చర్యలు తీసుకున్నారు.

News November 26, 2025

కన్నీటి నివాళి: ‘అమ్మే మా వెన్నెముక’

image

కుటుంబానికి వెన్నెముకగా, జీవితానికి వెలుగుగా నిలిచిన <<18391262>>అమ్మ<<>> రత్నమ్మ (83) ఇక లేరనే నిజాన్ని అంగీకరించడం భారంగా ఉందని ఎంపీ సీఎం రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ప్రేమ, త్యాగం, ఆప్యాయత మాటలతో చెప్పలేనంత గొప్పవని అన్నారు. అమ్మ లేకపోవడం మాటల్లో చెప్పలేని పెద్ద లోటుగా మిగిలిందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.

News November 26, 2025

ఎంపీ సీఎం రమేశ్ తల్లి మృతి

image

అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తల్లి చింతకుంట రత్నమ్మ (83) మృతిచెందారు. బుధవారం తెల్లవారుజామున 3.39 గంటలకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కడప జిల్లా పొట్లదుర్తి గ్రామంలో రేపు ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.