News June 20, 2024
ప్రొద్దుటూరు: 2,893 మద్యం బాటిళ్లు ధ్వంసం

ప్రొద్దుటూరులో గురువారం 2,893 మద్యం బాటిళ్లను కడప సెబ్ ఎన్ఫోర్స్ మెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు నాయుడు సమక్షంలో ధ్వంసం చేశారు. ప్రొద్దుటూరు రూరల్, వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లు, రాజుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం తరలిస్తున్న 98 కేసుల్లో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. సీఐలు రమణారెడ్డి, శ్రీకాంత్, అబ్దుల్ కరీం, మహేష్ కుమార్ పాల్గొన్నారు.
Similar News
News November 18, 2025
ప్రొద్దుటూరు: భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేత

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో సోమవారం CTO జ్ఞానానంద రెడ్డి ఆధ్వర్యంలో స్టేట్ ట్యాక్స్ అధికారుల బృందం సోదాలు నిర్వహించాయి. భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేతను గుర్తించారు. 2021 నుంచి జీఎస్టీ బకాయిలు సుమారు రూ.1.50 కోట్ల గుర్తించారు. ఎగ్జిబిషన్ నుంచి సుమారు రూ.1.కోటి, కూరగాయల మార్కెట్, షాపు రూములు ఇతరత్రా వాటి నుంచి మరో రూ.50 లక్షలు జీఎస్టీ ఎగవేతను గుర్తించినట్లు తెలిసింది.
News November 18, 2025
ప్రొద్దుటూరు: భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేత

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో సోమవారం CTO జ్ఞానానంద రెడ్డి ఆధ్వర్యంలో స్టేట్ ట్యాక్స్ అధికారుల బృందం సోదాలు నిర్వహించాయి. భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేతను గుర్తించారు. 2021 నుంచి జీఎస్టీ బకాయిలు సుమారు రూ.1.50 కోట్ల గుర్తించారు. ఎగ్జిబిషన్ నుంచి సుమారు రూ.1.కోటి, కూరగాయల మార్కెట్, షాపు రూములు ఇతరత్రా వాటి నుంచి మరో రూ.50 లక్షలు జీఎస్టీ ఎగవేతను గుర్తించినట్లు తెలిసింది.
News November 18, 2025
పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ను పూర్తి చేయాలి: కడప కలెక్టర్

కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఈఆర్వోలను ఆదేశించారు. సోమవారం ప్రత్యేక సమగ్ర సవరణ-2026పై రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న 1963 కేంద్రాలకు అదనంగా 158 కొత్త కేంద్రాలకు ప్రతిపాదనలు వచ్చాయని, దీనితో మొత్తం 2121 కేంద్రాలు అవుతాయని తెలిపారు. ఒకే కుటుంబం సభ్యులు ఒకే కేంద్రంలో ఉండేలా చూడాలన్నారు.


