News March 10, 2025

‘ప్లాస్టిక్ రహిత జిల్లాగా పార్వతీపురంను మారుద్దాం’

image

జిల్లాలో ప్లాస్టిక్‌ను, చెత్తను పూర్తిగా నిషేధిస్తూ ప్లాస్టిక్ రహిత జిల్లాగా పార్వతీపురంను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని పురపాలక సంఘాలు, పంచాయతీల్లో దీనిపై ఒక తీర్మానం చేసి అమలు చేయాలని అన్నారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు బోర్డులు, ఫ్లెక్సిలను ఏర్పాటుచేయాలని సూచించారు.

Similar News

News December 5, 2025

వామ్మో.. ఢిల్లీ-ముంబై టికెట్ ధర రూ.40వేలు

image

వందల సంఖ్యలో ఇండిగో ఫ్లైట్ సర్వీసులు రద్దు కావడంతో దేశీయ విమాన టికెట్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఢిల్లీ టు లండన్ టికెట్ ధర రూ.25వేలు ఉంటే ఢిల్లీ టు కొచ్చి టికెట్ ఫేర్ ఏకంగా రూ.40వేలకు పెంచేశారు. ఇది సాధారణంగా రూ.5,000-రూ.10,000 మధ్య ఉంటుంది. ఢిల్లీ-ముంబై టికెట్ ధర రూ.40,452కు ఎగబాకింది. అత్యవసరంగా వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రేట్లు పెంచవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

News December 5, 2025

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో గర్భిణులకు తప్పని ప్రైవేటు బాట

image

ఖమ్మం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో రూ.30 లక్షల విలువైన టిఫా స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి. దాదాపు ఏడదిన్నరగా రేడియాలజిస్ట్ లేకపోవడంతో ఈ కీలక సేవలు అందడం లేదు. శిశువు ఎదుగుదల తెలుసుకోవాల్సిన గర్భిణులు చేసేది లేక రూ.4,000 వరకు చెల్లించి ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. పూర్తిస్థాయి రేడియాలజిస్ట్‌ను నియమించాలని గర్భిణులు కోరుతున్నారు.

News December 5, 2025

సిరిసిల్ల: గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతి

image

సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీ సర్పంచ్ అభ్యర్థి చర్ల మురళి(51) గుండెపోటుతో మృతి చెందారు. బీఆర్ఎస్ మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఆయనకు గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆయణ్ను వేములవాడ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా, గుండెపోటు తీవ్రత ఎక్కువగా ఉన్నందున వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశారు.