News August 21, 2024
ప.గో. అబ్బాయి.. తూ.గో. అమ్మాయితో LOVE.. కత్తితో దాడి

ప.గో. జిల్లా ఆచంట మండలం కోడేరులంకకు చెందిన రమేశ్ తూ.గో. జిల్లా పి.గన్నవరం మండలం L.గన్నవరంలో PMPగా వైద్యం చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వరలక్ష్మిని ప్రేమించాడు. అమ్మాయి తండ్రి రమణకు విషయం చెప్పగా ఒప్పుకోలేదు. దీంతో ఆదివారం వారు ఓ చర్చిలో పెళ్లి చేసుకొని ఇంటికెళ్లారు. విషయం తెలిసిన రమణ మంగళవారం రాత్రి అబ్బాయి ఇంటికెళ్లి కత్తితో దాడి చేసి పారిపోయాడు. రమేష్ ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News October 23, 2025
ప్రజా సమస్యలను పరిష్కరించండి: కలెక్టర్

కాళ్ల మండలం పెదమిరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై గురువారం వివిధ శాఖల జిల్లా అధికారంతో కలెక్టర్ చదలవాడ నాగరాణి గూగుల్ మీట్ నిర్వహించారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులను నిర్ణీత గడువులోపుగా జిల్లా అధికారుల స్వీయగా పర్యవేక్షణలో పరిష్కరించాలన్నారు. లోపాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు.
News October 23, 2025
ఉండి: మేడవరం వద్ద స్కూల్ బస్సు బోల్తా

ఉండి మండలం పెదపుల్లేరు శివారు మేడవరం వద్ద గురువారం ఉదయం ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బస్సు అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు వారిని తక్షణమే బయటకు తీసి, చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 23, 2025
మండవల్లి: షార్ట్ సర్క్కూట్తో ఎలక్ట్రీషయన్ మృతి

మండవల్లి మండలం మండవల్లి గ్రామానికి చెందిన చిగురుపాటి సుకుమార్ (24) ప్రైవేట్ ఎలక్ట్రీషయన్గా పనిచేస్తున్నాడు. బుధవారం పెదపాడు మండలం ఏపూరులో ఎలక్ట్రికల్ లైన్లు మార్చే పనికి వెళ్ళాడు. ఎలక్ట్రికల్ స్తంభం ఎక్కిన కొద్దిసేపటికే అతను విద్యుత్ ఘాతానికి గురై కుప్పకూలాడు. తోటి పనివారు అతన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.