News March 12, 2025

ప.గో: ఆరు యూనిట్లు ఇసుక ధర ఎంతో తెలుసా..!

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుకకు డిమాండ్ తగ్గి ధరలు దిగోచ్చాయి. యూనిట్ ఇసుక రూ.10 వేలకే దొరుకుతోంది. జిల్లాలో భవన నిర్మాణాలు ఒక్కసారిగా మందగించడంతో ధర అందుబాటులో ఉన్నప్పటకి డిమాండ్ లేకపోవడంతో లారీ యాజామానులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ అభివృద్ధి పనులు ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయి. అయినప్పటికి అదనంగా ఛార్జీలు వస్తూలు చేస్తున్నారని కనీసం రూ.2 వేలు మిగలడం లేదని వాపోతున్నారు.

Similar News

News January 18, 2026

బధిరుల క్రీడల్లో ‘పశ్చిమ’ ప్రభంజనం.. జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం

image

హర్యానాలో జరిగిన రాష్ట్రస్థాయి బధిరుల క్రీడా పోటీల్లో ప.గో. జిల్లా క్రీడాకారులు ప్రథమ స్థానం సాధించారని అసోసియేషన్ గౌరవాధ్యక్షులు చెరుకువాడ రంగసాయి తెలిపారు. తొమ్మిది రాష్ట్రాల నుంచి 600 మంది పాల్గొన్న ఈపోటీల్లో, జిల్లా నుంచి వెళ్లిన 16 మంది ప్రతిభ కనబరిచారన్నారు. విజేతలను ఆదివారం భీమవరంలో ఘనంగా అభినందించారు. శారీరక వైకల్యాన్ని అధిగమించి క్రీడల్లో రాణించడం అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.

News January 17, 2026

పాస్ పుస్తకంతో సులభంగా భూమి వివరాలు: జేసీ

image

రైతులు తమ భూమికి సంబంధించిన వివరాలను పాసు పుస్తకాల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఆచంట మండలం పెనుమంచిలి గ్రామ సచివాలయం వద్ద జరిగిన గ్రామ సభలో జేసీ పాల్గొన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలను పరిశీలించారు. గ్రామ సభకు హాజరైన రైతులతో ఆయన మాట్లాడారు. రైతుల సందేహాలను నివృత్తి చేసి, పలు సూచనలు చేశారు.

News January 17, 2026

ప.గో: బాలికపై అత్యాచారం చేసిన వృద్ధుడు

image

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వృద్ధుడిని భీమవరం టూటౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎస్సై రెహమాన్ తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మరి వీధికి చెందిన కోణాల సరస్వతి (84) స్థానిక బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.