News April 18, 2024

ప.గో: ఈనెల 19న నామినేషన్లు వేసేది వీరే…

image

ప.గో.జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమై ఈనెల 25 వరకు కొనసాగనుంది.. ఈ క్రమంలో ఈ నెల 19న ఆరిమిల్లి రాధాకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, ముదునూరి ప్రసాద్ రాజు, నిమ్మల రామానాయుడు, కాంగ్రెస్ నుంచి కొలుకులూరి అర్జునరావు, నరసింహారాజు, ఆచంటలో వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ఈనెల 19న నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Similar News

News December 22, 2025

అండర్-19 నేషనల్ క్రికెట్ పోటీలకు భీమవరం విద్యార్థి ఎంపిక

image

ఢిల్లీలో ఈ నెల 24 నుంచి 27 వరకు జరగనున్న అండర్-19 నేషనల్ క్రికెట్ టోర్నమెంట్‌కు భీమవరం విద్యార్థి ఒల్లిపల్లి దుర్గా రాంచరణ్ ఎంపికయ్యాడు. 9వ తరగతి చదువుతున్న రాంచరణ్ ఇప్పటి వరకు 72 మ్యాచ్‌లు ఆడి 46 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో 139 పరుగుల అత్యధిక స్కోరు సాధించాడు. రాంచరణ్ మరిన్ని విజయాలు సాధించాలని స్థానికులు కోరుతున్నారు.

News December 22, 2025

తణుకు: బియ్యపు గింజపై బంగారంతో వైఎస్ జగన్ పేరు

image

మాజీ CM వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా తణుకుకు చెందిన సూక్ష్మ కళాకారుడు భవిరి నాగేంద్రకుమార్ తన ప్రతిభ చాటుకున్నారు. 0.030 పాయింట్ల బంగారంతో బియ్యపు గింజపై జగన్ పేరును తీర్చిదిద్దారు. సుమారు మూడు గంటల సమయం వెచ్చించి దీనిని సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. నాగేంద్ర కుమార్ నైపుణ్యాన్ని స్థానికులు, వైసీపీ నేతలు మెచ్చుకున్నారు.

News December 22, 2025

ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం సమీక్షించారు. ఆప్షన్-3, PMAY 1.0 ఇళ్ల నిర్మాణాల్లో అజయ్ వెంచర్స్, పల్లా ఏసుబాబు, జి.వెంకటేశ్వరరావు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు వేగవంతం చేసి సత్వరమే లబ్ధిదారులకు అప్పగించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని గుత్తేదారులను హెచ్చరించారు. గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.