News July 27, 2024

ప.గో: ఉద్ధృతంగానే గోదావరి.. అధికారుల అలర్ట్

image

భద్రాచలం వద్ద శనివారం 4PMకు నీటిమట్టం 53 అడుగులు ఉండగా అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో ఉమ్మడి ప.గో జిల్లాలో అధికారులు అలర్ట్ అయ్యారు. కలెక్టర్ నాగరాణి వరద ప్రభావంపై సమీక్ష నిర్వహించారు. లంక గ్రామాల ప్రజలకు భోజనం, వసతి, తాగునీటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. మూగజీవాలకు నష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఇబ్బందులున్న చోట వరద బాధితులు పునరావాస కేంద్రాలకు వెళ్లాలన్నారు.

Similar News

News February 22, 2026

మెంటేవారితోట: 1,000 పెన్నులతో బాల త్రిపుర సుందరికి అలంకరణ

image

ఇంటర్ మీడియట్ పరీక్షల్లో భాగంగా భీమవరం మెంటేవారితోటలోని శ్రీబాలత్రిపుర సుందరిదేవి అమ్మవారికి 1,000 పెన్నులతో ఆదివారం ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్వర్యంలో దాతల సహకారంతో ఆలయ అర్చకుడు శ్రీనివాస్ అమ్మవారికి కుంకుమ పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం 1,000 పెన్నులతో అమ్మవారిని అలంకరించారు. ఈ పెన్నులను విద్యార్థులకు అందజేస్తామని ఆలయ కమిటీ తెలిపింది.

News February 22, 2026

భీమవరం: రేపు 10గం.ల నుంచి 1 గంట వరకే ఈ కార్యక్రమం

image

భీమవరం కలెక్టరేట్‌ జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం PGRSను యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ నాగరాణి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్, వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30ని.ల వరకు అర్జీలను స్వీకరిస్తామన్నారు.

News February 22, 2026

ప.గో: EX MLA పేరుతో INSTA అకౌంట్.. నమ్మితే అంతే..!

image

నరసాపురం మాజీ MLA కొత్తపల్లి జానకీ రామ్ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ఖాతాల ద్వారా అభిమానులకు మెసేజ్‌లు పంపుతూ డబ్బులు అడుగుతున్నట్లు ఆదివారం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు, అనుచరులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ డబ్బులు పంపి మోసపోవద్దని జానకీ రామ్ కోరారు.