News February 17, 2025

ప.గో: ఎమ్మెల్సీ ఎన్నికకు ముమ్మర ఏర్పాట్లు

image

ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ గడువు సమీపిస్తోంది. దీనితో జిల్లా యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలైంది. బ్యాలెట్ పత్రాల ముద్రణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బందికి శిక్షణ తదితర పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 27న ఉ.8 గంటల నుంచి సా.4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 6 జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 2 వేల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.

Similar News

News February 22, 2025

పాలకొల్లు: జగన్‌కు సవాలు విసిరిన మంత్రి నిమ్మల

image

వెలిగొండ ప్రాజెక్టుపై వాస్తవాలను ఎవరు వక్రీస్తున్నారో ప్రజా క్షత్రంలో తెల్చుకుందామని, మాజీ సీఎం జగన్‌కు మంత్రి నిమ్మల శుక్రవారం సవాల్ విసిరారు. పోడూరు మండలం జిన్నూరులో రూ.3 కోట్లతో చేపట్టిన ప్రధాన కాలువ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ..వెలిగొండ ప్రజెక్ట్‌ను మూడుసార్లు సందర్శించాను. ప్రాజెక్ట్ పూర్తికాలేదని జగన్ ఒప్పుకున్నట్లైతే జాతికి ఎలా అంకితమిచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

News February 21, 2025

మొగల్తూరు : పేరుపాలెం బీచ్ సమీపంలో వ్యక్తి సూసైడ్

image

పేరుపాలెం బీచ్ సమీపంలోని కొబ్బరితోటలో ఓ వ్యక్తి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. మొగల్తూరు ఎస్సై జి. వాసు తెలిపిన వివరాలు.. రిసార్ట్ సమీపంలోని సీఆర్ జెడ్ పరిధిలోని తోటలో గుళికలు తిని మృతిచెందాడు. అయితే అతని జేబులో ఓ మహిళకు సంబంధించిన పాన్ కార్డు ఉందని , ఫోన్ లాక్ ఓపెన్ కాలేదని వీఆర్వో దుర్గారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడిది కృష్ణా జిల్లా కృతివెన్నుగా అనుమానిస్తున్నారు.

News February 21, 2025

భీమడోలు: కుళ్లిన ఎగ్ పఫ్ విక్రయాలు

image

భీమడోలు జంక్షన్‌లోని ఓ బేకరీలో గురువారం రాత్రి కుళ్లిన ఎగ్ పఫ్‌లను విక్రయించడం వివాదాస్పదమైంది. భీమడోలు మండలం పెదలింగంపాడు గ్రామానికి చెందిన పులిపాటి రాజు అనే వ్యక్తి ఎగ్ పఫ్‌లను కొని ఇంటికి తీసుకెళ్లాడు. పిల్లలు వాటిని తినే సమయంలో దుర్వాసన రావడంతో ఊసేశారు. దీంతో రాజు బేకరీ వద్దకు వెళ్లి, వ్యాపారిని నిలదీశాడు. అతడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో రాజు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

error: Content is protected !!