News May 27, 2024

ప.గో.: ఏఈఓల సంఘ ఉమ్మడి జిల్లాధ్యక్షుడిగా రాంబాబు

image

తాడేపల్లిగూడెం పట్టణంలోని వ్యవసాయ పరీక్ష కేంద్రంలో ఆదివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నెక్కంటి రాంబాబు, MDR.శివప్రసాద్ ఎన్నికయ్యారు. వీరితో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు వేణుమాధవరావు, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.

Similar News

News February 14, 2025

ప.గో : నామినేషన్లు విత్ డ్రా చేసుకుంది వీరే..

image

గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 35 మంది పోటీలో నిలిచారు. మొత్తం 54 మంది నామినేషన్ వేయగా అధికారులు 11 మంది నామినేషన్లను తిరస్కరించారు. అందులో 8 మంది విత్ డ్రా చేసుకున్నారు. 35 మంది బరిలో నిలిచారు. పిల్లంగొళ్ల లీలా నగేశ్, విజయలక్ష్మీ, కవల నాగేశ్వరరావు, పచ్చిగోళ్ల దుర్గారావు, పేరాబత్తుల సత్యవాణి, గండుమోలు బాలాజీ, సత్తి రాజు స్వామి, కోండ్రు చక్రపాణి విత్ డ్రా చేసుకున్నారు.

News February 14, 2025

యలమంచిలి : లారీ ఢీకొని మహిళ మృతి

image

లారీ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన యలమంచిలి ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం.. తాడిగరువుతోటకు చెందిన విజయ నడుచుకుని వెళ్తుండగా.. కొబ్బరిలోడు లారీ ఆమెను ఢీకొంది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె ముగ్గురు కుమార్తెలకు వివాహమైంది. భర్త ఇటీవల మృతి చెందినట్లు సమాచారం.

News February 14, 2025

ఏలూరులో వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్

image

ఏలూరులో ఈనెల 11న టూటౌన్ సీఐ వైవీ రమణ ఎన్ ఆర్ పేటలోని ఓవర్ బ్రిడ్జి కింద ఉన్న ఎస్ఎస్ బ్యూటీ యునిసెక్స్ బ్యూటీ పార్లర్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించి నిర్వాహకులు నాగార్జున, అతని భార్య శివదుర్గ, దివ్య, భాను ప్రకాశ్, నరేంద్రపై కేసు నమోదు చేశారు. నాగార్జున, శివదుర్గ, దివ్యలను కోర్టులో హాజరుపరచగా..14 రోజులు రిమాండ్ విధించారు. భాను ప్రకాశ్, నరేంద్ర పరారీలో ఉన్నారు.

error: Content is protected !!