News May 19, 2024
ప.గో.: ఒకే మండలం నుంచి 8 మంది MLA అభ్యర్థులు

ఏలూరు జిల్లాలోని పోలవరం నియోజకవర్గం నుంచి MLA అభ్యర్థులుగా బరిలో నిలిచిన 12 మందిలో 8 మంది బుట్టాయగూడెం మండలానికి చెందినవారే కావడం విశేషం. మిగతా నలుగురు జీలుగుమిల్లి మండలం వారు. వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మిది మండలంలోని దుద్దుకూరు కాగా, కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన దువ్వెల సృజనది ఇదే మండలంలోని కోయరాజమండ్రి గ్రామం. ఇక కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజుది జీలుగుమిల్లి మండలంలోని బర్రిలంకపాడు గ్రామం.
Similar News
News December 20, 2025
స్వచ్ఛతలో పశ్చిమను ప్రథమ స్థానంలో నిలుపుదాం: RRR

పశ్చిమ గోదావరి జిల్లాను రాష్ట్రంలోనే మొట్టమొదటి స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దేందుకు యువత, ప్రజలు నడుం బిగించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పిలుపునిచ్చారు. శనివారం భీమవరంలో ‘పర్యావరణంలో అవకాశాలు’ అనే థీమ్తో నిర్వహించిన సదస్సులో ఆయన కలెక్టర్ నాగరాణితో కలిసి పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.
News December 20, 2025
స్వచ్ఛతలో పశ్చిమను ప్రథమ స్థానంలో నిలుపుదాం: RRR

పశ్చిమ గోదావరి జిల్లాను రాష్ట్రంలోనే మొట్టమొదటి స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దేందుకు యువత, ప్రజలు నడుం బిగించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పిలుపునిచ్చారు. శనివారం భీమవరంలో ‘పర్యావరణంలో అవకాశాలు’ అనే థీమ్తో నిర్వహించిన సదస్సులో ఆయన కలెక్టర్ నాగరాణితో కలిసి పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.
News December 20, 2025
వీరవాసరం: ప్రజల ముంగిటకే ‘వాట్సాప్’ గవర్నెన్స్

పాలనను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో చేపట్టిన ‘వాట్సాప్ గవర్నెన్స్’ ప్రచారంలో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. శుక్రవారం వీరవాసరం రైల్వే స్టేషన్ రోడ్డులోని కొత్తపేట సచివాలయం-2 పరిధిలో అధికారులతో కలిసి ఆయన ఇంటింటికీ తిరిగారు. సాంకేతికతను అందిపుచ్చుకుని, సమయం వృథా కాకుండా ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జేసీ అన్నారు.


