News June 29, 2024

ప.గో.: కొంపముంచిన మొబైల్ యాప్.. మీరు జాగ్రత్త

image

ఆన్‌లైన్‌లో మోసపోయిన పలువురు కోనసీమ జిల్లా ద్రాక్షారామం పోలీసులకు ఫిర్యాదుచేశారు. వివరాలు.. రామచంద్రపురం, అంబాజీపేట తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు బుక్కూరి ఆనంద్, మద్దాల వినయ్, మోటుపల్లి కిరణ్ GMR యాప్‌ పరిచయం చేశారు. యాప్‌లో డబ్బులు పెడితే రెట్టింపు వస్తాయని నమ్మించారు. చాలామందికి నగదు వచ్చాయి. కొద్దిరోజులుగా నగదు రాకపోగా మోసపోయినట్లు గుర్తించారు. బాధితుల్లో తణుకుకు చెందిన వారు సైతం ఉన్నారు.

Similar News

News November 25, 2025

ధాన్యం కొనుగోలుపై ఫిర్యాదులకు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

image

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే కంట్రోల్‌ రూమ్‌ను సంప్రదించాలని ప.గో జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ సూచించారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొనుగోలు, రవాణా, తూకంలో సమస్యలుంటే 81216 76653, 1800 425 1291 నంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు. కొనుగోళ్లకు రైతు సేవా కేంద్రాలను సిద్ధం చేశామని, రైతులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

News November 25, 2025

కంటి ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు: కలెక్టర్‌

image

పంచేంద్రియాల్లో నయనాలు ప్రధానమైనవని, ఉద్యోగులు కంటి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ నాగరాణి సూచించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. చూపు విషయంలో అశ్రద్ధ తగదని, వైద్యుల సలహాలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఆమె పేర్కొన్నారు.

News November 25, 2025

కంటి ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు: కలెక్టర్‌

image

పంచేంద్రియాల్లో నయనాలు ప్రధానమైనవని, ఉద్యోగులు కంటి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ నాగరాణి సూచించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. చూపు విషయంలో అశ్రద్ధ తగదని, వైద్యుల సలహాలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఆమె పేర్కొన్నారు.