News July 15, 2024
ప.గో.: కొడుకు బర్త్ డే.. యాక్సిడెంట్లో తల్లి మృతి

ప.గో.జిల్లా తాడేపల్లిగూడెం వాసి సత్యశ్రీనివాస్ బర్త్డే సందర్భంగా తల్లిదండ్రులు, సోదరితో కలిసి ద్వారకాతిరుమలకు దర్శనానికి కారులో వెళ్లారు. తిరిగి వస్తుండగా నల్లజర్ల మండలం అచ్చన్నపాలెంలో మూవీ చూశారు. సోదరిని అత్తవారింట్లో దించి వస్తానని వారిని అక్కడే ఉండమని చెప్పాడు. ఈ క్రమంలో తల్లి సుబ్బలక్ష్మి, తండ్రి బసవరాజు రోడ్డు దాడుతుండగా వారిని కారు ఢీకొంది. ఆసుపత్రికి తరలిస్తుండగా సుబ్బలక్ష్మి చనిపోయింది.
Similar News
News November 9, 2025
భీమవరం: భక్త కనకదాసు జయంతి

భీమవరం మున్సిపల్ కార్యాలయంలో ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు శ్రీ భక్త కనకదాస జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు, సామాజిక తత్వవేత్త అని అన్నారు.
News November 8, 2025
భీమవరం: భక్త కనకదాసు జయంతి

భీమవరం మున్సిపల్ కార్యాలయంలో ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు శ్రీ భక్త కనకదాస జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు, సామాజిక తత్వవేత్త అని అన్నారు.
News November 8, 2025
ఈ నెల 12న జిల్లాలో వైసీపీ నిరసన ర్యాలీలు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపడుతున్నామని వైసీపీ పార్లమెంట్ అబ్జర్వర్ మురళీ కృష్ణంరాజు, భీమవరం ఇన్ఛార్జి వెంకట్రాయుడు తెలిపారు. శనివారం రాయలంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నెల రోజులుగా సంతకాల సేకరణ ఉద్యమం జరుగుతోందని, దానిలో భాగంగా 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.


