News May 26, 2024

ప.గో.: జనసేన అభ్యర్థులు గెలవాలని ప్రత్యేక పూజలు

image

సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థులు గెలవాలని ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడు ప్రత్యేకపూజలు చేయించారు. ప.గో. జిల్లా నరసాపురం మండలం LB.చర్ల గ్రామానికి చెందిన జనసైనికుడు కటకంశెట్టి సంజీవరావు అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో పవన్‌కళ్యాణ్, నాయకర్ చిత్రపటాలతో కూర్చొని ప్రత్యేక పూజలు చేయించారు.

Similar News

News October 13, 2025

తణుకు: గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

image

తణుకు మండలం పైడిపర్రు కాలువలో పడి గల్లంతైన బొమ్మనబోయిన జోగేంద్ర (13) మృతదేహాన్ని పోలీసులు సోమవారం గుర్తించారు. జోగేంద్ర తన స్నేహితులతో కలిసి ఆడుకుందామని వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. అత్తిలి మండలం గుమ్మంపాడు సమీపంలో కాలువలో బాలుడు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News October 13, 2025

ఈనెల 17న తణుకులో జిల్లా యువజనోత్సవాలు: కలెక్టర్

image

ఈనెల 17న తణుకులో జిల్లా యువజనోత్సవాలు జరుగుతాయని, పోటీల్లో పాల్గొనేందుకు 15 నుంచి 29 ఏళ్ల యువకులు అర్హులని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలు నవంబర్ 2025లో విజయవాడలో జరుగుతాయని, జాతీయస్థాయి పోటీలు జనవరి 2026 ఢిల్లీలో జరుగుతాయన్నారు. దీనిలో భాగంగా ఈనెల15న భీమవరం ఎస్ఆర్ కేఆర్‌లో ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

News October 12, 2025

TPG: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

తాడేపల్లిగూడెం (M) ఎల్.అగ్రహారం జాతీయ రహదారి డివైడర్‌పై ఏలూరు వైపు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు రూరల్ పోలీసులు ఆదివారం తెలిపారు. మృతుడు కోల ముఖం కలిగి టీ-షర్టు, షార్ట్ ధరించి ఉన్నాడన్నారు. ఆచూకీ తెలిసిన వారు తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ నంబర్ 944796612, 9441834286‌ను సంప్రదించాలన్నారు.