News January 16, 2025
ప.గో జిల్లాను పచ్చగా నిర్మించుకుందాం: కలెక్టర్ నాగరాణి

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ నాగరాణి గురువారం అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తొలి దశలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, టీ గ్లాసులను నిషేధిస్తున్నామన్నారు. కలెక్టరేట్ నుంచే ఈ కార్యక్రమం అమలు జరుగుతుందన్నారు. జిల్లాను పచ్చగా నిర్మించుకుందామని, అందరూ సహకరించాలని, ఆంక్షలు మీరితే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News October 22, 2025
నరసాపురం: కీచక తండ్రి కటకటాల్లోకి..!

కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన తండ్రిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నరసాపురానికి చెందిన మహిళ తన ఇద్దరు కుమార్తెలను భర్త వద్ద వదిలి గల్ఫ్ వెళ్లింది. ఈ క్రమంలో ఆ తండ్రి తాగి వచ్చి తన కుమార్తె (13) పట్ల కీచకుడయ్యాడు. ఇటీవల గల్ఫ్ నుంచి తల్లి రావడంతో కుమార్తెలు విషయం చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు విచారణ అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా రిమాండు విధించారు.
News October 22, 2025
నరసాపురం: కీచక తండ్రి కటకటాల్లోకి..!

కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన తండ్రిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నరసాపురానికి చెందిన మహిళ తన ఇద్దరు కుమార్తెలను భర్త వద్ద వదిలి గల్ఫ్ వెళ్లింది. ఈ క్రమంలో ఆ తండ్రి తాగి వచ్చి తన కుమార్తె (13) పట్ల కీచకుడయ్యాడు. ఇటీవల గల్ఫ్ నుంచి తల్లి రావడంతో కుమార్తెలు విషయం చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు విచారణ అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా రిమాండు విధించారు.
News October 22, 2025
ఈనెల 27న TPG లో కొనుగోలు కేంద్రం ప్రారంభం: జేసీ

ఈనెల 27న తాడేపల్లిగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు జేసీ రాహుల్ తెలిపారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రైతు సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు.