News July 8, 2024

ప.గో జిల్లాలో జోరుగా వ్యవసాయ పనులు

image

ప.గో జిల్లాలో వ్యవసాయ పనులు జోరందుకున్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు అన్నారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు, గణపవరం మండలాల్లో 21,983 ఎకరాల్లో ఇప్పటికే నాట్లు పడ్డాయన్నారు. ఈ నెలాఖరుకు అత్యధిక విస్తీర్ణంలో నాట్లు పూర్తవుతాయని, పల్లపు ప్రాంతాల్లో నారు సంరక్షణకు రైతులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు.

Similar News

News September 15, 2025

భీమవరం: ఉపాధి శ్రామికులకు బకాయి వేతనాల చెల్లింపు

image

ప.గో జిల్లాలో ఉపాధి శ్రామికులకు వేతన బకాయిలు విడుదల అయ్యాయి. జిల్లాలోని 99 వేల మందికి గాను రూ.55 కోట్లు మేర వారి అకౌంట్లలో అధికారులు జమ చేశారు. నాలుగు నెలలుగా వేతనాలు రాక శ్రామికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దసరా ముందు నిధులు విడుదల చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి నిధుల విడుదలలో జాప్యం కారణంగానే ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు.

News September 15, 2025

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమవారం జిల్లా, మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను సమీపంలోని కార్యాలయాల్లో లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో సమర్పించుకోవచ్చని ఆమె సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని కోరారు.

News September 14, 2025

వరి రైతుకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి: జేసీ

image

వరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి వ్యాపారులను ఆదేశించారు. ఆదివారం ఆయన కడియద్దలో పర్యటించి, వరి కోతలను పరిశీలించారు. అనంతరం రైతులు, ట్రేడర్లతో మాట్లాడి పంట ధర గురించి ఆరా తీశారు. అంతకుముందు ఉల్లిపాయల మార్కెట్‌లో ఉల్లి ధరలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, తహశీల్దార్ పాల్గొన్నారు.