News April 19, 2024

ప.గో.: జిల్లాలో ఫస్ట్ డే నిల్ నామినేషన్స్

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో తొలి రోజు ఒక్క నామినేషన్‌ మాత్రమే దాఖలైంది. నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి అత్తిలి మండలం ఆరవల్లికి చెందిన సత్తి సూర్యనారాయణరెడ్డి ఒక సెట్‌ దరఖాస్తును కలెక్టరు సుమిత్‌కుమార్‌కు అందజేశారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడా నామినేషన్లు దాఖలు కాలేదని తెలిపారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎక్కువ మంది నేడు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు.

Similar News

News October 28, 2025

4,155 మందికి పునరావాసం: కలెక్టర్

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 37 పునరావాస కేంద్రాల్లో మంగళవారం మధ్యాహ్నం నాటికి 4,155 మంది బాధితులకు భోజన సౌకర్యం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 3,581 ఎకరాల వరి పొలాల్లో వర్షపు నీరు చేరిందని, జిల్లాలో తుఫాను కారణంగా 10 గ్రామాలు ముంపునకు గురి కాగలదని గుర్తించడం జరిగిందని ఆమె వెల్లడించారు.

News October 28, 2025

జిల్లాలో మరిన్ని పునరావాస కేంద్రాలు: కలెక్టర్

image

మొంథా తుఫాను నేపథ్యంలో జిల్లాలో ఇప్పటివరకు 29 పునరావస కేంద్రాలను సిద్ధం చేశామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుతం 19 పునరావాస కేంద్రాలను నిర్వహించడం జరుగుతుందని భారీ వర్షాల కారణంగా ఎక్కడైనా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయవలసి వస్తే అధికారులు అందుకు తగిన విధంగా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.

News October 28, 2025

ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

జిల్లాలో 200 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున, అధికారులు 24 గంటలూ అప్రమత్తతతో ఉండాలని కలెక్టర్ నాగరాణి మంగళవారం గూగుల్ మీట్ ద్వారా సమీక్షలో ఆదేశించారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, మండలాలకు పంపిన డ్రోన్స్ వెంటనే వినియోగించాలని సూచించారు. ఏ సమస్య వచ్చినా తక్షణం పరిష్కరించాలని స్పష్టం చేశారు.