News February 27, 2025

ప.గో. జిల్లా ప్రజలకు ఎస్పీ సూచన

image

అనధికారిక ఘాట్లలో స్నానం చేయకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు, భక్తులకు ప.గో.జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ అన్నారు. ఈసందర్భంగా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసిన ఈ క్రింది ఘాట్లలో ప్రజల భద్రత నిమితం రక్షణ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. నరసాపురం టౌన్, కోడేరు, కరుగోరుమిల్లి, పెదమల్లం, సిధాంతం, దొడ్డిపట్ల ఘాట్లలో స్నానం ఆచరించాలన్నారు.

Similar News

News February 27, 2025

ఉమ్మడి ప.గో : తీరని విషాదం నింపిన శివరాత్రి

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో శివరాత్రి పలుకుటుంబాలకు తీరని విషాదం మిగిల్చింది. ఏలూరులో బలివే క్షేత్రానికి వెళ్లొచ్చి చెరువులో స్నానానికి దిగి వెంకటేశ్వరరావు, అతని తమ్ముని కుమారుడు సుబ్రహ్మణ్యం గల్లంతయ్యారు. ఆచూకీ తెలియలేదు. లింగపాలేనికి చెందిన అన్నదమ్ములు మణికుమార్, మునియ్య తమ్మిలేరులో మునిగి చనిపోయారు. పట్టిసీమలో నాగవీరభద్ర రావు, బలివే క్షేత్రానికి వచ్చిన అన్నవరం గుండెపోటుతో మృతి చెందారు.

News February 26, 2025

ప.గో జిల్లాలో: TODAY TOP HEADLINES

image

✷ ప.గో జిల్లాలో శివాలయాలకు పోటెత్తిన భక్తులు
✷ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం కలెక్టర్ నాగరాణి
✷ నర్సాపురంలో భారీగా మద్యం సీసాలు లభ్యం
✷ ఆచంటలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో దాసిరాజు
✷ నర్సాపురం మహిళ కడుపులో ఏడు కేజీల కణితి
✷ పాలకొల్లులో బెల్ట్ షాప్ నిర్వాహకుడు అరెస్టు
✷ నాగాలాండ్‌లో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ

News February 26, 2025

నరసాపురం : మహిళ కడుపులో ఏడు కేజీల కణితి 

image

నరసాపురం మండలం సారవ గ్రామానికి చెందిన మహిళ కడుపు నొప్పితో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షలు చేసి కడుపులో దాదాపు ఏడు కేజీల కణితి ఉందని నిర్ధారించారు. మంగళవారం మహిళకి ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న ఏడు కేజీల కణితిని తొలగించారు. ప్రస్తుతం పేషెంట్ ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని గైనకాలజిస్ట్ డా.అద్దంకి విజ్ఞాని తెలిపారు.

error: Content is protected !!