News October 19, 2024
ప.గో జిల్లా రీజనల్ కోఆర్డినేటర్గా బొత్స

వైసీపీ ప.గో జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి మాజీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రీజనల్ కోఆర్డినేటర్ల నియామకంలో భాగంగా ప.గో జిల్లాకు బొత్సను నియమిస్తున్నట్లు ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News November 18, 2025
భీమవరం: ‘సీబీ-సీఐడీ’ పేరుతో మోసం

భీమవరం పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి శర్మ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకొని రూ.78 లక్షలు పోగొట్టుకున్నారు. గత నెల 27న సీబీ-సీఐడీ అధికారులమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, సిమ్ సమస్యను పరిష్కరించడానికి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు అడిగారని ఆయన తెలిపారు. వారి మాటలు నమ్మి వివరాలు చెప్పడంతో, తన ఖాతా నుంచి దఫదఫాలుగా రూ.78 లక్షలను మాయం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 18, 2025
భీమవరం: ‘సీబీ-సీఐడీ’ పేరుతో మోసం

భీమవరం పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి శర్మ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకొని రూ.78 లక్షలు పోగొట్టుకున్నారు. గత నెల 27న సీబీ-సీఐడీ అధికారులమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, సిమ్ సమస్యను పరిష్కరించడానికి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు అడిగారని ఆయన తెలిపారు. వారి మాటలు నమ్మి వివరాలు చెప్పడంతో, తన ఖాతా నుంచి దఫదఫాలుగా రూ.78 లక్షలను మాయం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 18, 2025
తణుకు: ‘తల్లిదండ్రులను చూడని పిల్లలు శిక్షార్హులు’

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి వారి పోషణ పట్టించుకోలేని పిల్లలు శిక్షార్హులు అవుతారని తణుకు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పోతర్లంక సాయిరాం అన్నారు. సోమవారం తణుకు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు ఆర్డీవో అధికారుల ద్వారా న్యాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.


