News April 3, 2024

ప.గో.: టీడీపీ- బీజేపీ- JSP కూటమి అధినాయకులకు విజ్ఞప్తి

image

టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అధినాయకులకు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య బుధవారం ఒక విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 25% జనాభా ఉన్న కాపు కులస్థులకు కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో వారి సంతృప్తి మేరకు హామీలను ప్రకటించాలన్నారు. బీసీలతో సమానంగా సంక్షేమ సౌకర్యాలు, పెళ్లి ఖర్చుల నిమిత్తం కానుకగా రూ.లక్ష ఇవ్వాలన్నారు. జనాభా ప్రాతిపదికన కాపు కార్పొరేషన్ సంక్షేమ బడ్జెట్, అలాగే రిజర్వేషన్లు కేటాయించాలన్నారు.

Similar News

News January 8, 2026

ప.గో: యువకుడి ఆత్మహత్య

image

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం ఉండిలో చోటుచేసుంది. ఉండి శివారు ఉప్పగుంట వద్ద చేపల చెరువు వద్ద పనిచేస్తున్న దీప్ జ్యోతి బాస్మతి (21) చెరువు గట్టు మీద ఉన్న రేకుల షెడ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలంగా మృతుడు తన తండ్రి సుకుమార్‌తో కలిసి ఉండిలో ఓ చేపలచెరువు వద్ద పనిచేస్తున్నాడు. మృతుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు SI నసీరుల్లా తెలిపారు.

News January 8, 2026

నేడు భీమవరంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు

image

భీమవరం డీఎన్ఆర్ స్వయం ప్రతిపత్తి కళాశాలలో గురువారం ప్రభుత్వ ఉద్యోగుల శాఖాపరమైన అర్హత పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి ఆదేశించారు. ఈ పరీక్షకు సుమారు 100 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన ఏర్పాటు చేయాలని సూచించారు.

News January 8, 2026

నేడు భీమవరంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు

image

భీమవరం డీఎన్ఆర్ స్వయం ప్రతిపత్తి కళాశాలలో గురువారం ప్రభుత్వ ఉద్యోగుల శాఖాపరమైన అర్హత పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి ఆదేశించారు. ఈ పరీక్షకు సుమారు 100 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన ఏర్పాటు చేయాలని సూచించారు.