News May 19, 2024

ప.గో.: తాను చనిపోయినా.. మరొకరికి ప్రాణం

image

ప.గో. జిల్లా యలమంచిలి మండలం కుమ్మరిపాలేనికి చెందిన పవన్ (19) ఇటీవల ఇంటివద్ద కొబ్బరిచెట్టు మీదపడగా గాయపడ్డాడు. విశాఖ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందాడు. అవయవదానం చేస్తే మరొకరికి ప్రాణం పోస్తాయని ఆలోచించి పుట్టెడు దు:ఖంలోనూ తల్లిదండ్రులు శ్రీనివాస రావు, శ్రీదేవి ముందుకొచ్చారు. కుమారుడి అవయవాలను విశాఖ కిమ్స్‌లో దానం చేశారు. అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు జరిపారు.

Similar News

News December 12, 2025

దివ్యాంగుడి సమస్య విన్న కలెక్టర్

image

భీమవరం మండలం గూట్లపాడుకి చెందిన గౌరీ శంకరరావు కుటుంబ సభ్యులు శుక్రవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశానికి వచ్చారు. వీరిని చూసిన కలెక్టర్ చదలవాడ నాగరాణి దివ్యాంగుడు శంకర్ పరిస్థితిని చూసి సమస్యను అడిగి తెలుసుకున్నారు. పుట్టుకతోనే అంగవైకల్యం ఉండడంతో దివ్యాంగ ఫించన్ రూ. 6 వేల వస్తోందని, వందశాతం అంగవైకల్యం ఉన్న తనకు రూ.15 వేల పింఛన్ ఇవ్వాలని కోరాడు. ఈ అర్జీని కలెక్టర్ అధికారులకు సిఫార్సు చేశారు.

News December 12, 2025

నరసాపురం నుంచి వందేభారత్

image

నరసాపురం – చెన్నైకి వందేభారత్ నడిచేందుకు ఈ నెల 15 న ముహూర్తం ఖరారయింది. ప.గో నుంచి ఇదే తొలిసారి కావడంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ రైలు నరసాపురం – విజయవాడ మధ్య నరసాపురం, భీమవరం, గుడివాడలో ఆగుతుంది. కాగా ఇది నరసాపురంలో మ. 2.50కి బయలుదేరి రాత్రి 11.45కు చెన్నైకి చేరుతుంది. తిరిగి ఉ. 5.35కు బయలుదేరి మ.2.10కి నరసాపురంలో ఉంటుంది.

News December 12, 2025

భీమవరం: లింక్ క్లిక్.. సినిమా స్టైల్‌లో నగదు మాయం

image

భీమవరంలోని శివరావుపేటకు చెందిన శ్రీరామదాసు సైబర్ మోసానికి గురయ్యాడు. ఫోన్‌కు వచ్చిన లింక్‌పై క్లిక్ చేయడంతో బ్యాంక్ అకౌంట్ నుంచి సినిమాలో చూపించే తరహాలో రూ.1,70,400 ఐదు దఫాలుగా వెంట వెంటనే కట్ అయిపోయాయి. దీంతో బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ నంబర్ 1930కు ఫిర్యాదు చేశాడు. భీమవరం టూటౌన్ సీఐ కాళీచరణ్ అకౌంట్లలో ఉన్న రూ.90 వేలు ఫ్రీజ్ చేయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.