News March 8, 2025
ప.గో: తొలి ప్రయత్నంలోనే DSP అయ్యారు..!

డాక్టర్ చదివిన ఓ మహిళ అనూహ్యంగా పోలీసయ్యారు. అదీనూ తొలిప్రయత్నంలోనే కావడం విశేషం. ఆమే నరసాపురం డీఎస్పీ డాక్టర్ జి.శ్రీవేద. పోలీసు కావాలనే లక్ష్యంతో డాక్టర్గా పనిచేస్తూనే గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించారు. నరసాపురం డీఎస్పీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలరని ఆమె చెప్పారు. #HappyWomensDay
Similar News
News December 20, 2025
స్వచ్ఛతలో పశ్చిమను ప్రథమ స్థానంలో నిలుపుదాం: RRR

పశ్చిమ గోదావరి జిల్లాను రాష్ట్రంలోనే మొట్టమొదటి స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దేందుకు యువత, ప్రజలు నడుం బిగించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పిలుపునిచ్చారు. శనివారం భీమవరంలో ‘పర్యావరణంలో అవకాశాలు’ అనే థీమ్తో నిర్వహించిన సదస్సులో ఆయన కలెక్టర్ నాగరాణితో కలిసి పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.
News December 20, 2025
వీరవాసరం: ప్రజల ముంగిటకే ‘వాట్సాప్’ గవర్నెన్స్

పాలనను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో చేపట్టిన ‘వాట్సాప్ గవర్నెన్స్’ ప్రచారంలో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. శుక్రవారం వీరవాసరం రైల్వే స్టేషన్ రోడ్డులోని కొత్తపేట సచివాలయం-2 పరిధిలో అధికారులతో కలిసి ఆయన ఇంటింటికీ తిరిగారు. సాంకేతికతను అందిపుచ్చుకుని, సమయం వృథా కాకుండా ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జేసీ అన్నారు.
News December 19, 2025
‘సుశాసన్ సప్తాహ్ – ప్రశాసన్ గావ్ కీ ఒరే విజయవంతం చేయాలి: జేసీ

‘సుశాసన్ సప్తాహ్ – ప్రశాసన్ గావ్ కీ ఒరే 2025’ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేసీ రాహుల్ పిలుపునిచ్చారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్ నుంచి దేశవ్యాప్త ప్రచార ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆయన వర్చువల్గా వీక్షించారు. ఈ నెల 25 వరకు నిర్వహించే ఈ వారోత్సవాల ద్వారా గ్రామీణ స్థాయిలో సమస్యల పరిష్కారానికి, పారదర్శక పాలనకు పెద్దపీట వేయనున్నట్లు జేసీ తెలిపారు.


