News June 4, 2024

ప.గో.: తొలి MPలు తేలేది మనోళ్లే.. ఎవరో చూడండి

image

పార్లమెంట్ ఎన్నికల్లో తొలిఫలితం రాజమండ్రి, నరసాపురం MP స్థానాల్లో రానుంది. కాగా అమలాపురంలో ఎంపీ నియోజకవర్గంలో ఫలితాలు ఆలస్యంగా రానున్నాయి. కాగా రాజమండ్రిలో కూటమి నుంచి పురందీశ్వరి, వైసీపీ నుంచి గూడూరి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇక నరసాపురంలో కూటమి నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, గూడూరి ఉమాబాల, అటు అమలాపురంలో వైసీపీ నుంచి రాపాక శ్రీనివాస్, కూటమి నుంచి గంటి హరీష్ మాదుర్ బరిలో ఉన్నారు.

Similar News

News October 26, 2025

అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దు: కలెక్టర్

image

మొంథా తుపాను నేపథ్యంలో నేటి నుంచి ఈనెల 29 వరకు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని, సముద్రతీర ప్రాంతాలు ప్రాంతాల్లో తిరగవద్దని కలెక్టర్ నాగరాణి సూచించారు. జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులంతా అందుబాటులో ఉండాలన్నారు. సోమవారం నిర్వహించాల్సిన పిజిఆర్ఎస్ రద్దు చేశామని చెప్పారు. కిందపడిన కరెంట్ వైర్లు, స్తంభాలతో ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు.

News October 26, 2025

ఆచంట: ఆస్తుల పంపకాల్లో గొడవ.. గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

image

గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆచంట మండలం పెదమల్లంలో చోటుచేసుకుంది. ఆచంట పోలీసుల వివరాల ప్రకారం.. తూ.గో జిల్లా పెరవలి మండలం మల్లేశ్వరానికి చెందిన బొలిశెట్టి నరసింహారాజు తన తాలూకా కుటుంబ ఆస్తులు పంపకాలు చేయడం లేదని మనస్థాపానికి గురయ్యారు. దీంతో నిన్న సాయంత్రం సరిహద్దులో ఉన్న పెద్దమల్లంలో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 26, 2025

ప.గో: రైతులకు తుఫాను భయం

image

ప.గో జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజానీకం అల్లాడుతోంది. ముఖ్యం తుఫాను భయంతో రైతుల గుండెల్లో గుబులు పట్టుకుంది. పంటలు చేతికొస్తున్న సమయంలో వర్షంతో నష్టం వాటిల్లే అవకాశం ఉందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పల్లపు ప్రాంతాలు, లంక గ్రామాల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో ఆయా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.