News April 24, 2024

ప.గో.: తోట సీతారామలక్ష్మికి అభినందనలు

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తోట సీతారామలక్ష్మి నాయకత్వంలో కూటమి విజయం సాధిస్తుందని తెలుగు మహిళా జిల్లాధ్యక్షురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి అన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో రాష్ట్ర సభ్యురాలుగా నియమితులైన ఆమెను భీమవరం పార్టీ కార్యాలయంలో కలిసి అభినందనలు తెలిపారు. నరసాపురం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు మంతెన రామరాజు, ఉండి అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ఉన్నారు.

Similar News

News November 21, 2025

ప.గో: 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ కేంద్రాలుగా మార్పు

image

పశ్చిమగోదావరి జిల్లాలో 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి డి. లక్ష్మీ తెలిపారు. వీటిలో పనిచేస్తున్న 10వ తరగతి పాసైన 59 మందికి మెయిన్ కార్యకర్తలుగా పదోన్నతి లభిస్తుందని ఆమె అన్నారు. దీంతో వారి గౌరవ వేతనం రూ.7 వేల నుంచి రూ.11,500 లకు పెరుగుతుందని లక్ష్మీ తెలియజేశారు.

News November 21, 2025

ప.గో: 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ కేంద్రాలుగా మార్పు

image

పశ్చిమగోదావరి జిల్లాలో 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి డి. లక్ష్మీ తెలిపారు. వీటిలో పనిచేస్తున్న 10వ తరగతి పాసైన 59 మందికి మెయిన్ కార్యకర్తలుగా పదోన్నతి లభిస్తుందని ఆమె అన్నారు. దీంతో వారి గౌరవ వేతనం రూ.7 వేల నుంచి రూ.11,500 లకు పెరుగుతుందని లక్ష్మీ తెలియజేశారు.

News November 20, 2025

30 గ్రామాల రీ-సర్వే తక్షణమే పూర్తి చేయాలి: జేసీ

image

జిల్లాలో రీ-సర్వే జరుగుతున్న 30 గ్రామాల డేటా ఎంట్రీని పూర్తి చేసి, వెంటనే సర్టిఫికెట్లు పంపాలని జేసీ రాహుల్ అధికారులను ఆదేశించారు. గురువారం భీమవరం ఆయన మాట్లాడారు. భూ యజమానులకు కొనుగోలు, అమ్మకాలకు ఆటంకాలు ఉండకూడదన్నారు. థర్డ్ ఫేస్ రీ-సర్వేకు రైతులను రప్పించేందుకు తహశీల్దార్‌లు మరింత కృషి చేయాలని ఆదేశించారు. జీవో 30 భూముల పూర్తి నివేదికను అందించాలని ఆయన కోరారు.