News April 24, 2024
ప.గో.: తోట సీతారామలక్ష్మికి అభినందనలు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తోట సీతారామలక్ష్మి నాయకత్వంలో కూటమి విజయం సాధిస్తుందని తెలుగు మహిళా జిల్లాధ్యక్షురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి అన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో రాష్ట్ర సభ్యురాలుగా నియమితులైన ఆమెను భీమవరం పార్టీ కార్యాలయంలో కలిసి అభినందనలు తెలిపారు. నరసాపురం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు మంతెన రామరాజు, ఉండి అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ఉన్నారు.
Similar News
News November 21, 2025
మొగల్తూరులో సినిమా హాల్ పరిశీలించిన జేసీ

మొగల్తూరులోని శ్రీదేవి జానకి థియేటర్ను జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పేరు మార్పుపై వచ్చిన విషయంపై థియేటర్ను సందర్శించినట్లు ఆయన తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రేక్షకుల సౌకర్యం కోసం యాజమాన్యానికి పలు సూచనలు చేశామన్నారు. థియేటర్లో ఎగ్జిట్ బోర్డులు, ఫైర్ సేఫ్టీ, తాగునీరు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ధియేటర్ సిబ్బందికి సూచించారు.
News November 21, 2025
ప.గో: 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ కేంద్రాలుగా మార్పు

పశ్చిమగోదావరి జిల్లాలో 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి డి. లక్ష్మీ తెలిపారు. వీటిలో పనిచేస్తున్న 10వ తరగతి పాసైన 59 మందికి మెయిన్ కార్యకర్తలుగా పదోన్నతి లభిస్తుందని ఆమె అన్నారు. దీంతో వారి గౌరవ వేతనం రూ.7 వేల నుంచి రూ.11,500 లకు పెరుగుతుందని లక్ష్మీ తెలియజేశారు.
News November 21, 2025
ప.గో: 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ కేంద్రాలుగా మార్పు

పశ్చిమగోదావరి జిల్లాలో 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి డి. లక్ష్మీ తెలిపారు. వీటిలో పనిచేస్తున్న 10వ తరగతి పాసైన 59 మందికి మెయిన్ కార్యకర్తలుగా పదోన్నతి లభిస్తుందని ఆమె అన్నారు. దీంతో వారి గౌరవ వేతనం రూ.7 వేల నుంచి రూ.11,500 లకు పెరుగుతుందని లక్ష్మీ తెలియజేశారు.


