News August 3, 2024
ప.గో: దారుణం.. చోరీకి వెళ్లి వృద్ధురాలిపై అత్యాచారం

వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేయాలని చూసిన ఇద్దరిని పాలకొల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. ప.గో SP ఆద్నాన్ నయీం అస్మీ వివరాల ప్రకారం.. గత నెల 29న పాలకొల్లులోని ఓ ఇంటిలో బొక్కా రాజు, మీసాల మావుల్లు చోరీకి వెళ్లారు. ఇంట్లో ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి ఆభరణాలు లాక్కున్నారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వృద్ధురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు ఈరోజు నిందితులను అరెస్ట్ చేశారు.
Similar News
News November 2, 2025
నరసాపురం: ‘లోక్ అదాలత్పై దృష్టి సారించాలి’

డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్పై ప్రత్యేక దృష్టి సారించాలని నరసాపురం 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి వాసంతి అన్నారు. ఈ మేరకు శనివారం నరసాపురం కోర్టు హాలులో పోలీసు ఉన్నతాధికారులతో, న్యాయవాదులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. కక్షిదారులకు తక్కువ సమయంలో సమ న్యాయం అందించడానికి పోలీస్ అధికారులు, న్యాయవాదులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.
News November 1, 2025
నరసాపురం: ‘లోక్ అదాలత్పై దృష్టి సారించాలి’

డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్పై ప్రత్యేక దృష్టి సారించాలని నరసాపురం 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి వాసంతి అన్నారు. ఈ మేరకు శనివారం నరసాపురం కోర్టు హాలులో పోలీసు ఉన్నతాధికారులతో, న్యాయవాదులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. కక్షిదారులకు తక్కువ సమయంలో సమ న్యాయం అందించడానికి పోలీస్ అధికారులు, న్యాయవాదులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.
News November 1, 2025
భీమవరం: పింఛన్లు అందజేసిన కలెక్టర్

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతోందని కలెక్టర్ నాగరాణి అన్నారు. భీమవరం వీరమ్మ పార్క్ చుట్టుపక్కల శనివారం లబ్ధిదారులకు కలెక్టర్ పింఛన్లు అందించారు. లబ్దిదారులకు పింఛన్లు అందజేసి వారి కుటుంబ యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొన్నారు. ప్రతి నెల సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారా అని ఆరా తీశారు.


