News December 26, 2024

ప.గో: దిశ మార్చుకున్న అల్పపీడనం..వర్షాలు ఎక్కడంటే

image

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం దిశ మార్చుకుందని విశాఖ వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. దక్షిణ తమిళనాడు, ఉత్తర తమిళనాడుకు సమీపంలో కొనసాగుతోంది. గురువారానికి వాయవ్యంగా పయనించి పశ్చిమ మధ్య, తీరానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించే క్రమంలో బలహీనపడుతుందని తెలిపింది. ఈ ప్రభావంతో నేడు, రేపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని రైతులు జాగ్రత్తలు పాటించాలన్నారు.

Similar News

News January 14, 2025

కొయ్యలగూడెం: మేక మాంసానికి కేజీ కోడి మాంసం ఫ్రీ

image

కొయ్యలగూడెం పట్టణంలోని టీపీ గూడెం రోడ్డులోని ఓ మాంస కొట్టు వ్యాపారి భారీ ఆఫర్ ప్రకటించారు. రేపు కనుమ సందర్భంగా కిలో మేక మాంసం రూ.800కు కొనుగోలు చేసిన వారికి కిలో కోడి మాంసం ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ రేపు ఒక్కరోజు మాత్రమే ఉంటుందన్నారు.

News January 14, 2025

ప.గో జిల్లాలో కోసా రూ. 3 వేలు

image

రసవత్తర పోరులో ఓడి ప్రాణాలు కోల్పోయిన పందెం కోళ్లకు ఉభయగోదావరి జిల్లాల్లో భలే గిరాకీ ధర పలుకుతోంది. అయితే ఇక్కడ పందేనికి సిద్ధం చేసే కోళ్లకు ఓ ప్రత్యేకమైన ఫుడ్ మెనూ ఉంటుంది. దీంతో అవి మరణించాక రుచిగా ఉంటాయని మాంసం ప్రియులు చెబుతూ ఉంటారు. దీంతో పందెంలోని ఒక కోసా రూ. 2వేలు నుంచి రూ.3 వేల వరకు ధర పలుకుతోందని పలువురు అంటున్నారు.

News January 14, 2025

ఏలూరుకు చెందిన చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆత్మహత్య

image

తూ.గో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కొల్లే రాజుకుమార్ (38) లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంకు చెందిన రాజ్ కుమార్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నారు. అయితే భార్యతో మనస్పర్థల కారణంగా గత 8 ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తుంది. బొమ్మూరు ఎస్సై ప్రియ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.