News May 22, 2024

ప.గో.: నాన్న తిట్టాడని SUICIDE

image

పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప.గో. జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుమంట్ర మండలం భట్లమగుటూరుకు చెందిన పి.శివకుమార్ (22) తండ్రి మందలించాడని మనస్తాపం చెంది పొలంలో పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతణ్ని స్థానికులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు.

Similar News

News October 4, 2025

ప.గో: 8489 మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లకు లబ్ధి

image

ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్న ఆటో, క్యాబ్ డ్రైవర్లకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. స్త్రీ శక్తి పథకం అనంతరం నష్ట పోతున్నామని భావించిన ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున అందజేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో 8,489 మందికి రూ.12.73 కోట్లు మేర లబ్ధి చేకూరనుంది. నేడు అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో రూ.15 వేలు చొప్పున జమ కానుంది.

News October 4, 2025

తణుకు: లాయర్ తెలివి.. నివ్వెర పోయిన పోలీసులు

image

హత్య కేసును పక్కదోవ పట్టించేందుకు లాయర్ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. తణుకులో అదృశ్యమైన మడుగుల సురేశ్‌ను హత్య చేసి అనంతరం అతని సెల్ ఫోన్ తీసుకుని తాడేపల్లిగూడెం వరకు వెళ్లి అక్కడ స్విచ్ ఆఫ్ చేసి కాలువలో పడేసిన వైనం పోలీసులను సైతం నివ్వేర పరిచింది. తణుకుకు చెందిన న్యాయవాది తిర్రే సత్యనారాయణ రాజుతో పాటు మరో నలుగురు యువకులు సురేశ్‌ను హత్య చేసిన తీరు సినిమాను తలపిస్తోంది.

News October 4, 2025

గోనె సంచులను అందించేందుకు చర్యలు: జేసీ

image

మిల్లర్ల నుండి నాణ్యమైన గోనె సంచులను సేకరించి రైతులకు అందించేందుకు ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలని జేసి రాహుల్ అన్నారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణకు అధికారులు సన్నద్ధం కావాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్ల మండలాల వారీగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, వివాదాలకు తావు లేకుండా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జేసి అన్నారు.