News May 22, 2024
ప.గో.: నాన్న తిట్టాడని SUICIDE

పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప.గో. జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుమంట్ర మండలం భట్లమగుటూరుకు చెందిన పి.శివకుమార్ (22) తండ్రి మందలించాడని మనస్తాపం చెంది పొలంలో పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతణ్ని స్థానికులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు.
Similar News
News October 11, 2025
జీవన ప్రమాణాలు మెరుగుదలకు కృషి చేయాలి: కలెక్టర్

ప్రకృతి సాగు ద్వారా పండించిన రుచికరమైన కూరగాయలను ప్రజలకు అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుదలకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒకప్పుడు సాంప్రదాయ వ్యవసాయం ద్వారా పండించిన మేలైన కూరగాయలనే వినియోగించేవారమని కలెక్టర్ అన్నారు.
News October 10, 2025
జీఎస్టీ తగ్గింపుతో వినియోగదారులకు ఊతం: కలెక్టర్

జీఎస్టీ స్లాబ్ రేట్ల తగ్గింపుతో వినియోగదారునికి మరింత ఊతం లభించిందని కలెక్టర్ నాగరాణి అన్నారు. ఈ ప్రయోజనంపై చివరి వ్యక్తి వరకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఆమె ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించి, తగ్గింపు రేట్లను పరిశీలించారు.
News October 10, 2025
జిల్లాలో సదరన్ క్యాంప్లను నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో పక్కాగా సదరన్ క్యాంపులను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్లో డీఎంహెచ్వో, డీసీహెచ్ఎస్, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్, డీఆర్ డీఏ పీడీలతో ఆమె సమీక్షించారు. దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారుల అప్పీల్స్ మేరకు దివ్యాంగత్వం శాతాన్ని తిరిగి లెక్కింపు కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు.