News March 25, 2024

ప.గో: నారా భువనేశ్వరి మలి విడత యాత్ర షెడ్యూల్

image

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ మలి విడత యాత్ర ప్రారంభం కానుంది. మంగళవారం పోలవరం, చింతలపూడి.. బుధవారం తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, గన్నవరం.. గురువారం నూజివీడు, పెనమలూరు, గుడివాడలో ఆమె పర్యటించనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ సమయంలో (SEP) మృతి చెందిన పలువురి కుటుంబాలను పరామర్శించేందుకు భువనేశ్వరి ఈ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.

Similar News

News January 5, 2026

ఉండి పబ్లిక్ హెల్త్ సెంటర్‌ను సందర్శించిన డిప్యూటీ స్పీకర్

image

ఉండి పబ్లిక్ హెల్త్ సెంటర్‌ను సోమవారం డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు సందర్శించారు.
హాస్పిటల్ పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణంలో పిచ్చి మొక్కలతో నిండిపోవడంతో వాటిని తొలగించి ఉద్యానవనంలా తయారు చేయాలని సిబ్బందికి చెప్పారు. రోగులకు అందతున్న సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు.

News January 5, 2026

గ్రామాభివృద్ధికి కూటమి కృషి చేస్తుంది: జిల్లా గ్రంథాలయ ఛైర్మన్

image

గ్రామాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఉండి నియోజవర్గం జనసేన పార్టీ ఇన్‌ఛార్జి జుత్తుగ నాగరాజు అన్నారు. ఉండి మండలం మహాదేవపట్నంలో సీసీ రోడ్డుకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామ సర్పంచ్ వనమా సుబ్బలక్ష్మి శ్రీనివాస్, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు బద్రి, పాసర్ల శ్రీనివాస్, నాగేశ్వరావు, పండు, కూటమి నాయకులు ఉన్నారు.

News January 5, 2026

పాలకొల్లు: ఇంటికి వెళ్లడానికి 4 గంటలు ఉందనగా..

image

పాలకొల్లుకు చెందిన దంపతులు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందారు. క్రిస్మస్ సెలవులకు స్వగ్రామం వచ్చి, తిరిగి వెళ్తుండగా ఇంటికి చేరడానికి మరో 4 గంటల సమయం ఉందనగా ఈ విషాదం జరిగింది. మృతులు కొటికలపూడి రాజమోహన్ రావు కుమారుడు, కోడలుగా గుర్తించారు. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేదని వచ్చి చూసి వెళ్తుండగా మృత్యువాత పడటంతో పాలకొల్లులో విషాద ఛాయలు అలముకున్నాయి.